Singareni Collieries: 2022-23లో సింగరేణి రికార్డు.. రూ.32 వేల కోట్ల టర్నోవర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) బొగ్గు ఉత్పత్తిలో గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 32,830 కోట్ల రికార్డు టర్నోవర్ను నమోదు చేసింది. సోమవారం ఇక్కడ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, కంపెనీ గత ఆర్థిక సంవత్సరం (2021-22) సాధించిన రూ.26,619 కోట్ల టర్నోవర్తో పోలిస్తే 23 శాతం వృద్ధిని నమోదు చేసింది. మొత్తం టర్నోవర్లో బొగ్గు విక్రయం ద్వారా రూ.28,459 కోట్లు, సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్ ద్వారా విద్యుత్ విక్రయం ద్వారా రూ.4,371 కోట్లు వచ్చాయి.
Also Read:Tiger Poaching Gang: పులులను వేటాడుతున్న ముఠా.. పోలీసులకు చిక్కిన నిందితులు
Also Read
2021-22 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ బొగ్గు విక్రయంలో 25 శాతం, విద్యుత్ విక్రయంలో 13 శాతం వృద్ధిని నమోదు చేసిందని కంపెనీ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీధర్ తెలిపారు. వచ్చే మూడేళ్లలో రూ. 50,000 కోట్ల టర్నోవర్కు చేరుకోవడానికి కృషి చేస్తామన్నారు. 2023-34 ఆర్థిక సంవత్సరంలో వార్షిక బొగ్గు ఉత్పత్తిని 75 మిలియన్ టన్నులకు, 2025 నాటికి 80 మిలియన్ టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. సమీక్షా సమావేశంలో శ్రీధర్ మాట్లాడుతూ ఒడిశాలోని నైనీ ఓపెన్ కాస్ట్ గని, కొత్తగూడెంలోని వీకే ఓపెన్ కాస్ట్ గని, యెల్లందు ప్రాంతంలోని జేకే ఓసీ విస్తరణ గని, గోలేటి ఓసీ నుంచి 104 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. రాబోయే సంవత్సరాల్లో కంపెనీ బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
Also Read:France Minister: ‘ప్లేబాయ్’ మ్యాగజైన్ కవర్పై ఫ్రాన్స్ మంత్రి.. విమర్శల పాలైన మార్లిన్
నైనీ బొగ్గు బ్లాకుకు అన్ని అనుమతులు లభించాయని, ఒడిశా ప్రభుత్వం సహకరిస్తే 2023-24 ఆర్థిక సంవత్సరంలో 60 లక్షల టన్నులు, వచ్చే ఏడాది 100 లక్షల టన్నులు, ఆ తర్వాత ఏడాదికి 150 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయగలదని చెప్పారు. కొత్తగూడెంలోని వీకే ఓపెన్కాస్ట్కు దాదాపు అన్ని అనుమతులు లభించాయని, అటవీ అనుమతులు త్వరలో రానున్నాయని వెల్లడించారు. ఏటా కనీసం 30 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించాలని, ఇల్లందు ప్రాంతంలోని జేకే ఓసీ విస్తరణ గనిలో ఉత్పత్తి చేయాలన్నారు. ఈ ఏడాది చివరి నాటికి కనీసం 10 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగే అవకాశం ఉందన్నారు. రాబోయే సంవత్సరాల్లో ప్రభుత్వరంగ బొగ్గు కంపెనీలు ప్రైవేట్ కంపెనీల నుంచి గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్న శ్రీధర్, బొగ్గు వెలికితీతలో ఉత్పత్తి వ్యయాలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Also Read:SSC Paper Leak: పదో తరగతి పేపర్ లీక్ కేసు.. నలుగురు ఉద్యోగుల సస్పెన్షన్
2022-23 ఆర్థిక సంవత్సరంలో SCCL అత్యధిక వార్షిక ఉత్పత్తి 671 లక్షల టన్నుల బొగ్గును సాధించింది. 2021-22లో సాధించిన 650 టన్నుల ఉత్పత్తి కంటే ఇది 3.25 శాతం ఎక్కువ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ సుమారు 667 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేసింది. ఇది గత ఏడాది కంటే రెండు శాతం ఎక్కువ. తెలంగాణతో పాటు, కంపెనీ ఎనిమిది రాష్ట్రాల్లోని థర్మల్ పవర్ స్టేషన్లకు, దేశవ్యాప్తంగా సుమారు 2000 పరిశ్రమలకు బొగ్గును సరఫరా చేసింది. మార్చి 31న సింగరేణి చరిత్రలోనే అత్యధికంగా 2.64 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసి మార్చి 11, 2016న సాధించిన 2.59 లక్షల టన్నుల రికార్డును కూడా అధిగమించింది.
తాజావార్తలు
-
India First Hydrogen Train: భారత్ తొలి హైడ్రోజన్ రైలు ట్రయల్ రన్ సక్సెస్.. గంటకు 120 కిమీ వేగంతో పరుగులు
-
Donald Trump: “ఆ గౌరవం దక్కించుకున్న ఏకైక యూఎస్ ప్రెసిడెంట్ నేనే”.. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై ట్రంప్ ఫిదా!
-
Venezuela Earthquake: వెనెజువెలాను మళ్లీ వణికించిన భూకంపం.. ప్రజల్లో భయాందోళనలు
-
Vivo X Fold 6: 200MP కెమెరా, 7000mAh బ్యాటరీతో వివో ఎక్స్ ఫోల్డ్ 6 విడుదల.. ఫోల్డబుల్ ఫోన్లలో కొత్త బెంచ్మార్క్
-
TTD: రామ మందిరం విరాళాల వివాదం ఎఫెక్ట్.. టీటీడీ ఖాతాలకు టెక్నాలజీ అప్గ్రేడ్.! ఖాతాలకు టెక్నాలజీ అప్గ్రేడ్..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!