ఏపీ స్కూళ్ళలో పెరుగుతున్న పిల్లల హాజరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో ఒకవైపు కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. మరోవైపు సంక్రాంతి సెలవుల తర్వాత తెరుచుకున్న పాఠశాలల్లో విద్యార్థుల హాజరు గణనీయంగా పెరుగుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఉత్సాహంగా పాఠశాలలకు హాజరవుతున్నారని తొలిరోజు 61 శాతం హాజరు కాగా రెండోరోజు 74 శాతం విద్యార్థులు హాజరయ్యారని మంత్రి తెలిపారు. మంగళవారం రాష్ట్రంలోని కడప జిల్లాలో 82 శాతం, గుంటూరు 81 శాతం, అనంతపురం 80, కర్నూలు జిల్లాల్లో 78 శాతం, చిత్తూరు 77 శాతం అత్యధికంగా హాజరు నమోదైనట్లు మంత్రి తెలిపారు.
పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకుని విద్యార్థుల ఆరోగ్య భద్రత పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో పాఠశాలలను నడుపుతుందని మంత్రి తెలిపారు. తల్లిదండ్రులు విద్యార్థుల ఆరోగ్యం పట్ల ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అధికారులు, టీచర్లు అన్ని జాగ్రత్తలతో తరగతులు నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి సురేష్ తెలిపారు. అయితే, విపక్షాలు మాత్రం సెలవులు పొడిగించాలని కోరుతున్నాయి.
Also Read
తాజావార్తలు
-
Indian Player: అనూహ్యంగా టీమ్ ఇండియాలోకి ముంబై ఆల్రౌండర్.. జూన్ 26 నుంచి బరిలోకి..
-
CM Chandrababu Warning: పవన్ కల్యాణ్పై నోరు పారేసుకుంటే ఖబర్దార్.. చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
Jagadish Reddy: కుసుమ్ పథకంలో వెయ్యి కోట్ల స్కామ్.. రేవంత్ రెడ్డి ఒక ‘హైబ్రిడ్ సీఎం’
-
Tragedy: పాకిస్థాన్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కుటుంబంలో తీవ్ర విషాదం..
-
Bangladesh: బంగ్లాదేశ్కు చైనా యుద్ధ విమానాలు.. భారత్కు సవాలేనా.?
ట్రెండింగ్
-
సూపర్కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!
-
Water Bottle Cleaning: మీరు నీళ్లు తాగే బాటిల్ శుభ్రంగా ఉందా.? బ్యాక్టీరియా, దుర్వాసన రాకుండా ఇలా చేసేయండి.!
-
Pesara Payasam: స్వీట్ తినాలినిపిస్తుందా.? తీపి + హెల్తీ ‘పెసరపప్పు పాయసం’ చేసేయండి ఇలా.!