‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో కు సమంత!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీయార్ నిర్వహిస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో నిదానంగా ఫిల్మ్ స్టార్స్ పార్టిసిపేషన్ తో మరింత కలర్ ఫుల్ కాబోతోంది. తాజాగా ఈ షోకు ప్రిన్స్ మహేశ్ బాబు హాజరయ్యాడన్నది తెలిసిందే. మహేశ్ బాబు ఈ గేమ్ లో పాల్గొని ఎంత మొత్తం గెలుచుకున్నాడో తెలియదు కానీ, ఆ ఎపిసోడ్ ప్రసారం కాకముందే, సమంత సైతం ‘ఎవరు మీలో కోటీశ్వరులు’కు హాజరైందనేది రూఢీ అయ్యింది. ఆమె మేనేజర్ మహేంద్రతో కలిసి ఈ కార్యక్రమంలో అందుకున్న చెక్ ను చూపిస్తూ సమంత ఓ ఫోటో దిగింది. ఇప్పుడా ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
యంగ్ టైగర్ ఎన్టీయార్, సమంత జంటగా ఇంతవరకూ నాలుగు సినిమాల్లో నటించారు. వీరిద్దరి కాంబినేషన్ లో తొలి చిత్రంగా ‘బృందావనం’ రూపుదిద్దుకుంది. ఆ తర్వాత ‘రామయ్యా వస్తావయ్యా, రభస, జనతా గ్యారేజ్ ‘ చిత్రాలు వచ్చాయి. సో… ఎన్టీయార్ కు, సమంతకు మధ్య చక్కటి కెమిస్ట్రీ ఉందనే అభిమానులంతా భావిస్తుంటారు. ఇక ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమానికి సమంత హాజరయినప్పుడు వారి మధ్య సంభాషణ ఏ విధంగా సాగి ఉంటుందో ఊహించుకోవచ్చు. పైగా విడాకులకు సంబంధించి సమంత ఓ క్లారిటీకి వచ్చేసిన తర్వాత జరిగిన ఈ షో లో చైతు – సమ్ము అనుబంధం గురించి ఎన్టీయార్ ఏమైనా ప్రశ్నలు అడిగారో లేదో తెలియదు కానీ, ఈ షో టీఆర్పీ మాత్రం సూపర్ గా పెరిగే ఛాన్స్ ఉంది.
Also Read
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం

తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!