కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న చివరి టీ20లో భారత్ భారీ స్కోరు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. దీంతో కివీస్ ముందు 185 పరుగుల భారీ టార్గెట్ నిలిచింది. ఓపెనర్ రోహిత్ (56) అర్థసెంచరీతో అదరగొట్టాడు. ఇషాన్ కిషన్ 29, శ్రేయాస్ అయ్యర్ 25, వెంకటేష్ అయ్యర్ 20 పరుగులు చేశారు. సూర్యకుమార్ యాదవ్ డకౌట్గా వెనుతిరిగాడు. చివర్లో దీపక్ చాహర్ (8 బంతుల్లో 21 నాటౌట్) బౌండరీలతో అదరగొట్టాడు. హర్షల్ పటేల్ 18 పరుగులు చేసి హిట్ వికెట్గా అవుటయ్యాడు. న్యూజిలాండ్ బౌలర్లలో శాంట్నర్ 3 వికెట్లు పడగొట్టగా.. బౌల్ట్, మిల్నే, ఫెర్గూసన్, సోధీ ఒక్కో వికెట్ తీశారు.
ధోనీని వెనక్కి నెట్టిన రోహిత్
కాగా అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక సార్లు 50 ప్లస్ పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో ధోనీ(123)ని వెనక్కి నెట్టి రోహిత్ శర్మ (124 హాఫ్ సెంచరీలు) ఐదోస్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో సచిన్ 264 హాఫ్ సెంచరీలతో టాప్లో కొనసాగుతున్నాడు. రాహుల్ ద్రవిడ్ (193), విరాట్ కోహ్లీ (188), సౌరబ్ గంగూలీ (144) మాత్రమే రోహిత్ కంటే ముందున్నారు.