NTV Telugu Site icon

తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. మరో రెండు రోజులు పాటు వర్షాలు

తెలుగు రాష్ట్రాలకు రెండు రోజుల పాటు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఉపరితల ఆవర్తనం దక్షిణ ఛత్తీస్ ఘడ్ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కిమీ వద్ద ఏర్పడింది. గాలి విచ్చిన్నం తెలుగు రాష్ట్రాలపై సముద్ర మట్టానికి 1.5 కిమీ వరకు ఉంది. మరోవైపు నైరుతి ఋతుపవనాలు బలపడ్డాయి. రానున్న 24 గంటల్లో ఈ ఋతుపవనాలు కర్యలలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో తెలుగు రాష్ట్రాలలో రాగల రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణ జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో పలు చోట్ల వర్షాలు కురిశాయి. ఇవాళ కోస్తాంధ్ర, రాయలసీమలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక నిన్న హైదరాబాద్ లో భారీ వర్షం కురిసిన సంగతి తెలిసిందే.