కెప్టెన్ సాబ్… ఈసారైనా పార్టీని నిలుపుకుంటారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్లో కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్టు ఇప్పటికే కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కొన్ని అనూహ్యమైన కారణాల వలన అమరీందర్ సింగ్ పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చింది. రాజీనామా చేసిన తరువాత ఆయన ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో భేటీ అయ్యారు. బీజేపీలో చేరి పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేయాలని అనుకున్నారు. అయితే, గత కొంతకాలంగా రైతు చట్టాలకు వ్యతిరేకంగా సిక్కు రైతులు పోరాటం చేస్తున్నారు. పంజాబ్ రైతులే ఈ రైతు చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడుతున్నారు. ఈ సమయంలో అమరీందర్ సింగ్ బీజేపీలో చేరడం వలన ఉపయోగం ఉండదు. పైగా బీజీపీకి మరింత చెడ్డపేరు తీసుకొచ్చే అవకాశం ఉన్నది. ఈ కారణం చేతనే అమరీందర్ సింగ్ కొత్త పార్టీని ఏర్పాటు చేసి బీజేపీతో పొత్తు పెట్టుకోబోతున్నారు. కాంగ్రెప్ పార్టీ వైఫల్యాలను ఎత్తి చూపుతూ, పంజాబ్ ప్రజలకు తాను మాత్రమే న్యాయం చేయగలనని భరోసా ఇచ్చారు.
Read: పొంచి ఉన్న ఐఎస్ ముప్పు… ఆరు నెలల్లో దాడి జరగవచ్చు…
Also Read
- Trump-Iran: పశ్చిమాసియా రౌడీ చనిపోయాడు.. ఇరాన్పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
- Ireland: ఐర్లాండ్లో అల్లర్లు.. తగలబడ్డ కార్లు, భవనాలు
- Pakistan: పీవోకేలో కూలిన పాక్ హెలికాప్టర్.. 21 మంది సైనికులు మృతి
- Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
కాగా అమరీందర్ సింగ్ పార్టీని ఏర్పాటు చేయడం కొత్తేమి కాదు. 1980లో కెప్టెన్ అమరీందర్ సింగ్ కాంగ్రెస్ నాయకుడు రాజీవ్ గాంధీ నేతృత్వంలో ఆ పార్టీలో చేరారు. 1984లో సిక్కుల ఊచకోతను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి అకాలీదళ్ పార్టీలో చేరారు. అకాలీదళ్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. బాదల్ కుటుంబంతో వచ్చిన విభేదాల కారణంగా బయటకు వచ్చి శిరోమణి అకాలీదళ్ (పంథిక్) పేరుతో పార్టీని ఏర్పాటు చేశారు. ఆ తరువాత కొన్నాళ్లకు అంటే 1998లో కాంగ్రెస్లో చేరి తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. మరలా ఇన్నేళ్లకు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి కొత్తపార్టీని ఏర్పాటు చేయబోతున్నారు. మరి ఇప్పుడు ఏర్పాటు చేయబోతున్న కొత్త పార్టీనైనా నిలుపుకుంటారా లేదంటే కొన్నాళ్ల తరువాత మరో పార్టీలో విలీనం చేస్తారా చూడాలి.
తాజావార్తలు
-
Sri Lanka: ఈస్టర్ బాంబు దాడి వెనుక కుట్ర.. శ్రీలంక మాజీ అధ్యక్షుడు, స్పై చీఫ్పై సంచలన ఆరోపణలు
-
SS Rajamouli: సింగీతం శ్రీనివాసరావు కోసం రాజమౌళి ఏం చేశారో చూశారా?.. లైవ్ వీడియో కాల్లో జక్కన్న సర్ప్రైజ్!
-
PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
-
APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
-
Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!