Poonch Terror Attack: పూంచ్ దాడిలో సంచలన విషయం.. ఉగ్రవాదులకు స్థానికుల సాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పూంచ్లో ఆర్మీ వాహనంపై దాడి ఘటనలో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దాడిలో లష్కరే తోయిబాకు చెందిన 6 మంది వ్యక్తుల ప్రమేయం ఉందని, అందులో ఒకరి కుటుంబం మొత్తం కుట్రలో భాగమేనని పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) దిల్బాగ్ సింగ్ తెలిపారు. ఈ ఆరుగురు ఉగ్రవాదులు పూర్తి ప్రణాళికతో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, హ్యాండ్ గ్రెనేడ్లు, నగదుతో సహా లాజిస్టిక్స్లో సహాయం చేశారని ఆయన చెప్పారు.
ఏప్రిల్ 20న పూంచ్లోని తోట గలి వద్ద ఆర్మీ ట్రక్కు మెరుపుదాడి చేయడంతో 221 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు డీజీపీ తెలిపారు. వీరిలో దాదాపు అరడజను మందిని అధికారికంగా అరెస్టు చేశారు. పూంచ్పై దాడి కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు గుర్తించారు. వీరిలో నిసార్ అహ్మద్, ఫరీద్ అహ్మద్ మరియు ముస్తాక్ అహ్మద్ మెంధార్ సబ్ డివిజన్కు చెందిన వారని అంగీకరించారు.
Also Read:Gold Price Today: ఆభరణాల కొనుగోలుకు ఇదే సరైన సమయం.. తులం బంగారం ఎంతంటే?
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
- Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్ విడుదల.. కార్యకర్తలు సంబరాలు
ఆర్మీ ట్రక్కును లక్ష్యంగా చేసుకుని ఈ ఉగ్రవాదులు 7.62 ఎంఎం స్టీల్ కోర్ బుల్లెట్లు, ఐఈడీలను ఉపయోగించారని డీజీపీ తెలిపారు. నిందితుడు నిసార్ అహ్మద్ గురించి డీజీపీ వివరిస్తూ 1990లలో ఓవర్గ్రౌండ్ వర్కర్ కావడంతో, పోలీసులు అతన్ని ఇంతకు ముందు కూడా పట్టుకున్నారని చెప్పారు. అందుకే ఈసారి కూడా ఆయనపై అనుమానం వచ్చింది. ఈ దాడి కుట్రలో అతనే కాకుండా అతని కుటుంబ సభ్యులందరి ప్రమేయం ఉందని విచారణలో తేలింది.
గత రెండు-మూడు నెలలుగా నిసార్ అహ్మద్, అతని కుటుంబం ఉగ్రవాదులకు ఆహారం, నీరు, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు. పాకిస్థాన్ డ్రోన్ ద్వారా ఒక సరుకును పంపింది. దానిని నిసార్ ఉగ్రవాదులకు అందించాడు. సరుకులో నగదు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, హ్యాండ్ గ్రెనేడ్లు ఉన్నాయి. ఈ మాడ్యూల్ను బహిర్గతం చేయడంతో ఇప్పుడు ముందుకు వెళ్లే మార్గం సుగమమైందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చెప్పారు. దాడి చేసిన వ్యక్తులు రెండు మూడు నెలల పాటు భట్ ధురియన్ అడవుల్లోని సహజ గుహల్లో విడిది చేసి ఉంటారని భావిస్తున్నట్లు డీజీపీ తెలిపారు. ఇప్పుడు నిందితుల ఆచూకీ, లాజిస్టిక్స్ ఎలా ఏర్పాటు చేశారు తదితర అంశాలపై దర్యాప్తు చేయనున్నారు.
Also Read:Gold Price Today: ఆభరణాల కొనుగోలుకు ఇదే సరైన సమయం.. తులం బంగారం ఎంతంటే?
తాజావార్తలు
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
-
SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
ట్రెండింగ్
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?