టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ను గత రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ శ్రేణులు ఒక్కసారి భగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలో నేడు సికింద్రాబాద్లోని మహ్మత్మాగాంధీ విగ్రహం నుంచి ప్యారడైజ్ సర్కిల్ వరకు బీజేపీ శ్రేణులు భారీగా ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీ ఈ రోజు సాయంత్ర 5 గంటలకు నిర్వహించనున్నట్లు బీజేపీ నేతలు వెల్లడించారు. ఈ ర్యాలీలో పాల్గొనడానికి బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా శంషాబాద్ ఎయిర్పోర్ట్కు విచ్చేశారు.
దీంతో ఆయనను అడ్డుకునేందుకు, ర్యాలీకి అనుమతులు లేవని జాయింగ్ సీపీ కార్తికేయ శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. అంతేకాకుండ ఆయనతో పాటు కరోనా ఆంక్షల జీవోను తీసుకొచ్చారు. ర్యాలీలో పాల్గొనడానికి వచ్చిన నడ్డాకు జాయింట్ సీపీ కార్తికేయ కోవిడ్ నిబంధనల జీవోను వివరించి ర్యాలీకి అనుమతులు లేవని వివరించారు. కరోనా నిబంధనలతోనే ర్యాలీ నిర్వహిస్తామని, నా ప్రజాస్వామ్య హక్కును ఎవరూ అడ్డుకోలేరని జేపీ నడ్డా అన్నారు. అయితే నడ్డాతో చర్చలు జరిపిన పోలీసులు చివరికి కరోనా నిబంధనలతోనే ర్యాలీకి అనుమతులు ఇచ్చారు. అయితే కరోనా ఆంక్షలు పాటించాలని పోలీసులు సూచించారు. దీంతో కాసేపట్లో బీజేపీ ర్యాలీ సికింద్రాబాద్లోని మహాత్మాగాంధీ విగ్రహం నుంచి ప్యారడైజ్ సర్కిల్ వరకు జరుగునుంది.
