NTV Telugu Site icon

హైదరాబాద్‌ కు ఈటల.. సిద్ధిపేటలో ఆగి ఏం చేశారంటే..

BJP MLA Etela rajender

హుజురాబాద్‌ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన తరువాత ఈటల రాజేందర్‌ మొదటి సారిగా హైదరాబాద్‌కు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో మార్గమధ్యంలో సిద్ధిపేటలోని రంగదాంపల్లి చౌరస్తాలో ఆగారు. అక్కడ ఉన్న అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మంత్రి హరీశ్‌రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా హరీశ్‌రావు వచ్చి సిద్ధిపేటలా అభివృద్ధి చేస్తానంటూ ఆ నియోజకవర్గ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. కానీ.. హుజురాబాద్‌ ప్రజలు హరీశ్‌రావుకి తగిన బుద్ది చెప్పారని విమర్శించారు. హుజురాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో నిలిపివేసిన దళిత బంధు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.