కోవిడ్ –19 చికిత్సలో వాడే మందులను నాట్కో ట్రస్టు తరపున ఉచితంగా అందిస్తామని సీఎం వైయస్ జగన్కు నాట్కో ఫార్మా లిమిటెడ్ లేఖ రాసింది. కోవిడ్ –19 చికిత్సలో వాడే బారిసిటినిబ్–4 ఎంజీ (బారినట్) టాబ్లెట్స్ ఉచితంగా ఇవ్వనున్నట్టు లేఖలో పేర్కొంది నాట్కో ట్రస్టు. సుమారు లక్ష మంది కోవిడ్ పేషెంట్లకు ఈ టాబ్లెట్లు సరఫరా చేయనున్నట్టు తెలిపింది నాట్కో ఫార్మా లిమిటెడ్. రూ.4 కోట్ల 20 లక్షలు మార్కెట్ ఖరీదు చేసే టాబ్లెట్స్ను ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య సంస్ధల్లో చికిత్స పొందుతున్న కోవిడ్ పేషెంట్లకు ఇవ్వనున్నట్టు పేర్కొంది నాట్కో ట్రస్టు. విడతల వారీగా రానున్న కొద్ది వారాల్లో ఈ మెడిసిన్ సరఫరా చేయనున్నట్టు స్పష్టం చేశారు నాట్కో ట్రస్టు మేనేజింగ్ ట్రస్టు విసి నన్నపనేని.