నేడు నల్గొండ జిల్లాలో మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి లు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ రోజు ఉదయం 8:30 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 10:30 గంటలకు నల్లగొండకు చేరుకుంటారు. వారికి బైక్ ర్యాలీలతో టీఆర్ఎస్ శ్రేణులు స్వాగతం పలుకనున్నారు. ఉదయం 10:45 నిమిషాలకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఎస్సీ,ఎస్టీ హాస్టల్ ప్రారంభం. ఉదయం 11 గంటలకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఐటీ హబ్ కార్యాలయానికి శంకుస్థాపన.
మధ్యాహ్నం 12:30 గంటలకు బీట్ మార్కెట్లో వెజ్ & నాన్ వెజ్ మార్కెట్ యార్డ్ కు శంకుస్థాపన. మధ్యాహ్నం 1 గంటకు నల్లగొండ జైలుఖాన వద్ద రైతుబజార్, బస్తీ దవాఖానలకు స్థల పరిశీలన. మధ్యాహ్నం 2 గంటలకు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు పరామర్శ. మధ్యాహ్నం 3 గంటలకు నల్లగొండ జిల్లాకు సంబంధించిన మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం. అనంతరం హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం కానున్నారు.