మనిషికి ప్రశాంతత చేకూర్చేది ఆధ్యాత్మికత మాత్రమే: హరీష్రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భక్తి టీవీ నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం కార్యక్రమం ఏడోరోజుకు చేరింది. ఏడోరోజు జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ మంత్రి హరీష్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు వేద పండితులు ప్రత్యేకంగా ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం మంత్రి హరీష్ రావు భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుత రోజుల్లో మనుషులపై పని ఒత్తిడి పెరిగిపోవడంతో ఒక్క క్షణం కూడా తీరిక దొరకడం లేదు. దీంతో ప్రతి ఒక్కరూ ఏదో తెలియని మానసిక ఆందోళనతో బాధపడుతున్నారు. మనిషి ఎంత సంపాదించినా.. ఎన్ని ఆస్తులు ఉన్నా… ఎన్ని పదవులు ఉన్నా చివరకు.. కోరుకునేది ప్రశాంతతే అని.. మనిషికి ఆ ప్రశాంతత చేకూర్చేది ఆధ్యాత్మిక చింతన మాత్రమే అని హరీష్రావు అభిప్రాయపడ్డారు.
Read Also: చంద్రబాబుని వదలని వరద.. మునిగిన ఇల్లు
Also Read
- Rahul Gandhi: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్పై కంగనా విమర్శలు.. ఆమె ఇష్టమని రాహుల్గాంధీ మద్దతు
- Tamil Nadu: పొట్టి దుస్తుల వైరల్ వీడియోపై మహిళ ఆవేదన.. బాధ్యతగా ఉండాలని విజ్ఞప్తి
- Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
- Modi Cabinet: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం.. కొత్త ముఖాలకు చోటు!
ఉపనిషత్తుల నుంచి ఈనాటి వేదపండితుల వరకు ఎందరెందరో మనిషికి ప్రశాంతత చాలా అవసరం అని చెప్తూనే ఉన్నారు. భగవంతుని సేవలోనే, భగవంతుడు దగ్గర ఉన్నప్పుడు మాత్రమే మనిషి తన ఆందోళనలను మరిచిపోయి ప్రశాంతంగా ఉండగలుగుతున్నాడు. అలాంటి ఆధ్యాత్మిక ఉట్టిపడేలా గత పదేళ్లుగా హైదరాబాద్ నగరంలో ప్రతి ఏడాది కార్తీకమాసంలో కోటి దీపోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్న ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమకు తాము ఏదైనా పని చేస్తే వ్యక్తిగత దినచర్యగా మారుతుందని… అదే అందరూ కలిసి ఏదైనా లక్ష్యం కోసం పనిచేస్తే అది ఉద్యమం అవుతుందని హరీష్రావు వ్యాఖ్యానించారు. అలాగే ఎవరి ఇంట్లో వారు పూజ చేసి దీపం వెలిగిస్తే అది భక్తి అవుతుందని.. అదే అందరూ ఒకచోట చేరి సామూహికంగా కోటి దీపోత్సవంలో దీపాలను వెలిగిస్తే భక్తి ఉద్యమంగా మారుతుందన్నారు. అలాంటి కోటి దీపోత్సవంలో పాల్గొన్న భక్తులకు భగవంతుడు ఆయురారోగ్యాలు అందించాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారు. ప్రతి ఏడాది ఈ కార్యక్రమంలో తనను చౌదరి గారు భాగస్వామ్యం చేస్తున్నారని హరీష్రావు తెలిపారు. ఇది తనకు దక్కిన భాగ్యంగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Operation Sindoor: పాక్ అణుకేంద్రం ‘‘కిరాణా హిల్స్’’పై దాడి.. సంచలన నిజం చెప్పిన మాజీ CDS..
-
Rahul Gandhi: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్పై కంగనా విమర్శలు.. ఆమె ఇష్టమని రాహుల్గాంధీ మద్దతు
-
IISc Study: ఆవు ఎంజైమ్తో ప్రమాదకర బ్యాక్టీరియాకు చెక్.. IISc సంచలన పరిశోధన
-
Romanchakam Trailer: సందీప్ రెడ్డి వంగా ప్రెజెంట్స్.. ‘రోమాంచకం’ ట్రైలర్లో ఏదో గట్టిగానే ఉంది!
-
Telangana Sports : గాయత్రి-త్రిసాకు సీఎం రేవంత్ అభినందనలు.. గోపీచంద్తో స్పెషల్ మీట్
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!