ఫ్లయింగ్ సిఖ్ మిల్కా సింగ్ కన్నుమూత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లెజెండరీ ఇండియన్ స్ప్రింటర్ మిల్కా సింగ్ కరోనా వైరస్ తో పోరాడి ఈ రోజు కన్నుమూశారు. ఆయన వయసు 91 సంవత్సరాలు. లెజెండ్ అథ్లెట్, ఫ్లయింగ్ సిఖ్గా పేరొందిన మిల్కా సింగ్ మే 20న కరోనా బారిన పడి దాదాపు నెలరోజుల పాటు కరోనాతో పోరాడి చివరకు మరణించారు. మే నెలలో ఆయనకు కరోనా సోకినప్పుడు చండీఘర్ లోని తన ఇంట్లోనే చికిత్స తీసుకున్నారు. ఆ తరువాత డాక్టర్ల సలహా మేరకు మొహాలీలోని ఆసుపత్రిలో చేరారు. ఆ తరువాత ఇంటికి చేరుకున్న మిల్కా సింగ్ ఆక్సిజన్ సాయంతో చికిత్స పొందారు. కానీ అనుకోకుండా ఆయన ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతో కుటుంబ సభ్యులు మిల్కా సింగ్ ను చండీగఢ్లోని పీజీఐఎంఈఆర్ ఆసుపత్రి ఐసీయూకు తరలించారు. కానీ డాక్టర్లు ఆయనను బ్రతికించలేకపోయారు.
Also Read : డబ్ల్యూటీసీ : రెండో రోజు ఆట కూడా కష్టమే..?
Also Read
- Siddaramaiah: కర్ణాటకలో ఉత్కంఠకు తెర.. గురువారం గుడ్బై చెప్పనున్న సిద్ధరామయ్య!
- Vizag: పరిచయస్తులే యమకింకరులు.. సాగర తీరంలో వరుస హత్యల వెనుక మిస్టరీ ఇదేనా?
- Nalgonda: ప్రాణం తీసిన దశాబ్ద కాలం క్రితం పగ.. బీఆర్ఎస్ నేత హత్య వెనుక ఏం జరిగిందంటే..!
- Marco Rubio: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచానికి దీర్ఘకాలిక సంక్షోభం.. మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు
మిల్కా సింగ్ ప్రపంచవ్యాప్తంగా ట్రాక్, ఫీల్డ్ ఈవెంట్లలో దేశం కోసం అనేక పురస్కారాలను గెలుచుకున్నాడు. 1958 టోక్యో ఆసియాడ్లో 200 మీటర్లు, 400 మీటర్ల రేసులను గెలుచుకున్న ఆయన ఆసియా క్రీడల్లో భారత్ తరఫున నాలుగు బంగారు పతకాలు సాధించాడు. 1962 జకార్తా ఆసియాడ్లో 400 మీటర్లు, 4×400 మీటర్ల రిలే రేసుల్లో బంగారు పతకాలను సాధించాడు. 1960 రోమ్ ఒలింపిక్స్లో 400 మీటర్ల ఫైనల్లో నాలుగో స్థానంలో నిలిచి సింగ్ ఒలింపిక్ పతకాన్ని కోల్పోయారు. కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకం సాధించిన తొలి భారత అథ్లెట్గా మిల్కాసింగ్ అప్పట్లో గుర్తింపు పొందారు. 1956, 1960, 1964 ఒలిపిక్స్లోనూ భారత్కి మిల్కాసింగ్ ప్రాతినిథ్యం వహించాడు. భారత ప్రభుత్వం ఈ దిగ్గజ అథ్లెట్ని పద్మ శ్రీ పురస్కారంతో సత్కరించింది. ఇక మాజీ జాతీయ వాలీబాల్ కెప్టెన్ అయిన అతని భార్య నిర్మల్ కౌర్ కూడా కరోనాతో మరణించారు. దాదాపు ఆమె చనిపోయిన వారం తరువాత సింగ్ కన్నుమూయడం విషాదకరం. ఆయన మృతికి రాష్ట్రపతి, ప్రధానమంత్రితో పాటు పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తూ ట్వీట్లు చేశారు.
The passing of sporting icon Milkha Singh fills my heart with grief. The story of his struggles and strength of character will continue to inspire generations of Indians. My deepest condolences to his family members, and countless admirers.
— President of India (@rashtrapatibhvn) June 18, 2021
In the passing away of Shri Milkha Singh Ji, we have lost a colossal sportsperson, who captured the nation’s imagination and had a special place in the hearts of countless Indians. His inspiring personality endeared himself to millions. Anguished by his passing away. pic.twitter.com/h99RNbXI28
— Narendra Modi (@narendramodi) June 18, 2021
తాజావార్తలు
-
Super Splendor: హీరో నుంచి కొత్త స్ల్పెండర్ బైక్ వచ్చేసింది.. అదరిపోయిన ఫీచర్స్.. తక్కువ ధరలోనే..
-
IMD : నైరుతి రుతుపవనాలు వచ్చేసినట్టేనా..? వాతావరణ శాఖ కీలక అప్డేట్..!
-
Musical Drama : గొంతు క్యాన్సర్ తో పోరాడే రేడియో జాకీ… నాలుగేళ్ల తర్వాత ఓటీటీలోకి మలయాళ ఎమోషనల్ డ్రామా
-
Telangana Congress: గాంధీభవన్లో కాంగ్రెస్ నేతల డిష్యూం.. డిష్యూం.. చొక్కాలు పట్టుకుని మరీ..
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!
-
Raw Mango Roti Pachadi: అమ్మ చేతి రుచిని గుర్తు చేసే పుల్లటి “మామిడికాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!