మెగా హీరో వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కిన చిత్రం ‘కొండపొలం’. రకుల్ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్రెడ్డి నిర్మించారు. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన కొండపొలం నవల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం, అక్టోబరు 8న ప్రేక్షకుల ముందుకొస్తోంది. కాగా, తాజాగా రకుల్ ప్రీత్ పాత్రను తెలియజేస్తూ ‘ఒబులమ్మ’ పాటను విడుదల చేయగా, మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ పాటకు కీరవాణి మ్యూజిక్ అందించారు. ఇందులో ఓబులమ్మ అనే పల్లెటూరి అమ్మాయిగా రకుల్ప్రీత్ సింగ్ నటించింది. వైష్ణవ్, రకుల్ జోడి తెరపై ఓ కొత్త అనుభూతిని పంచుతుందని చిత్రబృందం భావిస్తోంది.