పోలీస్ స్టేషన్కు కొన్నిసార్లు వింత వింత కేసులు వస్తుంటాయి. ఆ కేసులను చూసి పోలీసులు షాక్ అవుతుంటారు. కోడి కనిపించడం లేదని, కోడి గుడ్డు పెట్టడం లేదనే కేసులు కూడా పోలీస్ స్టేషన్కు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి విచిత్రమైన కేసు ఒకటి కర్ణాటకలోని హోలేహోన్నూర్ పోలీస్ స్టేషన్కు వచ్చింది. శివమొగ్గ జిల్లా భద్రావతి తాలూకాలోని సిద్లాపూర్ గ్రామానికి చెందిన ఓ రైతుకు నాలుగు ఆవులు ఉన్నాయి. ఆ ఆవులను ప్రతిరోజు సమీపంలో ఉన్న అడవికి తీసుకెళ్లి మేపుకొస్తుండేవాడు. ఉదయం, సాయంత్రం ఆవులు పాలు ఇచ్చేవి.
Read: ధారావిలో తొలి ఒమిక్రాన్ కేసు… అప్రమత్తమైన అధికారులు…
కానీ, నాలుగు రోజుల నుంచి ఆవులు పాలు ఇవ్వడం లేదని, మేత బాగానే మేస్తున్నాయని, కానీ పాలు ఇవ్వడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆవులు ఎలాగైనా పాలు ఇచ్చేలా చూడాలని పోలీసులను కోరాడు ఆ రైతు. రైతు ఫిర్యాదును చూసి పోలీసులు షాక్ అయ్యారు. ఇదెక్కడి కేసు అంటూ తలలు పట్టుకున్నారు. ఆవులు పాలు ఇవ్వకపోతే పోలీసులు ఏంచేస్తామని చెప్పి, ఇలాంటి కేసులు తీసుకోబొమని రైతుకు నచ్చజెప్పి తిరిగి పంపించేశారు.