ఆఖరి టెస్టు : మొదటిసారి ఇంగ్లాండ్ జట్టులోకి స్పిన్నర్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-ఇంగ్లాండ్ మధ్య ఉత్కంఠభరమైన టెస్ట్ సిరీస్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు జరిగిన నాలుగు టెస్టులో రెండు కోహ్లీసేన విజయం సాధించగా ఒకటి ఆతిథ్య జట్టు కైవసం చేసుకుంది. మరొకటి డ్రాగా ముగిసింది. అయితే ఈ నాలుగు టెస్టులో కూడా ఇంగ్లాండ్ జట్టు ఒక్క పూర్తి స్పిన్నర్ ను జట్టులోకి తీసుకోలేదు. కేవలం ఆల్ రౌండర్ మొయిన్ అలీ మాత్రమే ఆ బాధ్యతలు నిర్వర్తించాడు. కానీ ఈ నెల 10 న ప్రారంభం కానున్న ఆఖరి టెస్టులో ఇంగ్లాండ్ జట్టు మొదటిసారిగా ఓ పూర్తి స్పిన్నర్ ను రంగంలోకి దించనున్నట్లు తెలుస్తుంది. తాజాగా చివరి టెస్ట్ కు జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్ బోర్డు జోస్ బట్లర్, జాక్ లీచ్ ను జట్టులోకి తీసుకుంది. చివరి టెస్టుకు ముందు జట్టులోకి తీసుకోవడంతో స్పిన్నర్ జాక్ లీచ్ తుది జట్టులో ఆడటం ఖాయంగా కనిపిస్తుంది. అయితే లీచ్ రాకతో స్పిన్ ఆల్ రౌండర్ గా ఉన్న మొయిన్ అలీని తప్పించి పేసర్ సామ్ కర్రన్ ను ఆడించనున్నట్లు తెలుస్తుంది. అలాగే భారత జట్టులోకి కూడా అశ్విన్ రానున్నట్లు సమాచారం. చూడాలి మరి ఈ ఇంగ్లాండ్ స్పిన్నర్ టీం ఇండియా పై ఏ మాత్రం ప్రభావం చూపిస్తాడు అనేది.
Also Read
తాజావార్తలు
-
Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
-
Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
-
రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
-
Shivsena: ఉద్ధవ్కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
-
Kalki 2898 AD : ప్రభంజనం.. ఏకంగా రెండు జాతీయ అవార్డులు కైవసం!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!