హెటిరో డ్రగ్స్ సంస్థల్లో జరుగుతున్న ఐటీ సోదాల్లో వందల కోట్ల నగదు బయట పడడంతో అధికారులే నోరు వెల్లబెడుతున్నారు.. ఐటీ దాడులులో అక్రమాలు వెలుగు చూడడంతో పాట గుట్టల కొద్ద డబ్బులు దర్శనమిస్తున్నాయి.. మూడు రోజులుగా హెటిరో డ్రగ్స్లో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతుండగా.. రెండో రోజే రూ.100 కోట్లకు పైగా నగదు సీజ్ చేశారనే వార్తలు వచ్చాయి.. కానీ, ఇవాళ ఆ మొత్తం ఏకంగా రూ.200 కోట్లకు చేరినట్టుగా తెలుస్తోంది.. మూడ్రోజులుగా హెటిరో డ్రగ్స్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.. హెటిరో డ్రగ్స్ కార్యాలయంతో పాటు 22 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు.. ఈ సోదాల్లో ఇప్పటివరకు రూ. 200 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. సోదాల్లో భాగంగా.. బోరబండలోని ఓ ఫ్లాట్ నుంచి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు అధికారులు.. ఆ క్యాష్ను ఏకంగా నాలుగు వాహనాల్లో కోఠిలోని బ్యాంక్కు తరలించినట్టుగా తెలుస్తోంది.. హెటిరో ప్రధాన కార్యాలయంతో పాటు అధికారుల ఇళ్లలోనూ క్యాష్ దొరికినట్టుగా సమాచారం.. ఆ నగదుపై సరైన ఆధారాలు చూపెట్టక పోవడంతో ఆ మొత్తాన్ని సీజ్ చేశారు అధికారులు.. మొత్తంగా రూ. 200 కోట్ల నగదుతో పాటు భారీ మొత్తంలో ఇన్వాయిస్లు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది.
హెటిరో డ్రగ్స్లో ఐటీ సోదలు.. రూ.200 కోట్ల క్యాష్ సీజ్..!
