తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్ విద్యార్థి కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. తాను నాలుగు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యానని… ఏది రాసినా పాస్ చేస్తామని చెప్పిన అధికారులు ఇప్పుడు ఫెయిల్ చేశారని ట్విట్టర్లో ఆరోపించాడు. తన సూసైడ్కు మంత్రులు కేటీఆర్, సబితలే కారణమని వారిని ట్యాగ్ చేశాడు. దీంతో క్షణాల్లోనే ఇంటర్ విద్యార్థి చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది.
Read Also: తెలంగాణలో మరో 4 ఒమిక్రాన్ కేసులు
దీంతో విద్యాశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. విద్యార్థి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అయితే కాసేపటి తర్వాత ఇంటర్ విద్యార్థి ‘తాను బాగానే ఉన్నా’ అంటూ రీట్వీట్ చేయడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. తన సూసైడ్ ఎటెంప్ట్ నిర్ణయాన్ని మార్చుకున్నానని.. తనను మోటివేట్ చేసిన అందరికీ కృతజ్ఞతలు అంటూ యువకుడు తెలపడంతో అందరూ శాంతించారు.
