హుజురాబాద్లో భారీ ఓటింగ్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్నికల్లో భారీ పోలింగ్ జరగడం అభ్యర్ధుల విజయావకాశాలపై ప్రభావం చూపుతుంది. 2018 ఎన్నికల సందర్భంగా హుజురాబాద్లో 2,26,000 పైచిలుకు ఓట్లు ఉండేవి. తాజాగా ఉపఎన్నికలో కొత్తగా నమోదు చేసుకున్నవారికి ఓటు హక్కు కల్పించారు. దీంతో పది వేల ఓట్లు పెరిగి… ఆ సంఖ్య ఇప్పుడు 2,36,873కు చేరింది. హుజురాబాద్ నియోజకవర్గంలో మొత్తం ఐదు మండలాలున్నాయి. ఇల్లంతకుంట మండలంలో మిగతా మండలాల కంటే తక్కువ ఓట్లు ఉన్నాయి. ఈ మండలంలో కేవలం 24,799 మంది ఉండగా.. హుజురాబాద్ మండలంలో అత్యధికంగా 61,673 ఓట్లు ఉన్నాయి. పోలింగ్ సరళిని బట్టి 90 శాతం వరకూ పోలింగ్ నమోదయ్యే అవకాశం వుందని తెలుస్తోంది.
పోటీ ప్రధానంగా బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్గానే వుంది. అయితే, అధికార పార్టీ విద్యార్థి సంఘం నేత గెల్లు శ్రీనివాస్ని బరిలో నిలిపింది. బీజేపీ నుంచి మాజీ మంత్రి ఈటల పోటీలో వున్నారు. మిగతా వారి సంగతి అలా వుంచితే.. ఈటలకు ఈ ఉప ఎన్నికలో విజయం సాధించడం అత్యవసరం. టీఆర్ఎస్ పార్టీకి ప్రతిష్టాత్మకం. అందుకే పోలింగ్ శాతం పెరగడానికి తమవంతుగా ఎవరికి వారు ప్రయత్నాలు చేశారు.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Kiren Rijiju: లాక్డౌన్పై కిరణ్ రిజిజు క్లారిటీ.. పొదుపు మంత్రం వేళ కీలక వ్యాఖ్యలు
2018 అసెంబ్లీ, 2019 లోక్సభ ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి కాంగ్రెస్ 50 వేలకు పైగా ఓట్లు సాధించింది. పీసీసీ చీఫ్గా రేవంత్రెడ్డి నియామకంతో ఈసారి ఎలాగైనా విజయం సాధించాలనే తపన కనిపిస్తోంది. సీనియర్లు కూడా ప్రచారం చేయడంతో కాంగ్రెస్ ఓట్లు పెరుగుతాయని భావిస్తున్నారు. ఈ నియోజకవర్గంపై కొంత పట్టు ఉన్న ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్బాబు, పీసీపీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ వంటివారు ప్రచారం చేశారు.
ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపు ఖాయమని బీజేపీ నేతలు ధీమాగా వున్నారు. పోలింగ్ పెరగడమే అందుకు నిదర్శనంగా చెబుతున్నారు. అయితే, టీఆర్ఎస్ నేతలు మాత్రం పోలింగ్ బూత్లకు వచ్చిన ఓటర్లు తమ పాలనకు పాజిటివ్ సంకేతాలు అంటున్నారు. యువత కూడా భారీగా ఓటు వేయడానికి తరలి రావడం రెండు పార్టీలకు సెంటిమెంట్గా మారింది.
తాజావార్తలు
-
Shubman Gill: “మేం గెలవడానికి అస్సలు అర్హులం కాదు”.. సొంత జట్టుపై కెప్టెన్ గిల్ తీవ్ర ఆగ్రహం..
-
Rajinikanth-Kamal Haasan: రజినీ – కమల్ మల్టీస్టారర్ నుంచి త్రిష ఔట్..?
-
Finn Allen: 10 సిక్సర్లు, 4 ఫోర్లు.. అభిషేక్, వైభవ్ల ప్రత్యేక బ్యాట్స్మెన్ల జాబితాలో ఫిన్ అలెన్..
-
Astrology: మే 17 శనివారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..