130 కోట్లకు పైగా జనాభా ఉండే భారత్ లో కరోనా కేసులు భరోగా నమోదవుతున్నాయి. రోజుకు 4 వేలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. అయితే ఈ వైరస్ ను కట్టడి చేయడానికి చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ ను అమలుపరుస్తున్నాయి. అలాగే అందరూ తప్పకుండ భౌతిక దూరం పాటించాలి.. మాస్కులు ధరించాలి అని చెబుతున్నాయి. కానీ మన దేశంలో సంగంమంది మాస్కులు ధరించడం లేదు అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. దీనికి సంబంధించిన ఓ సర్వే నిర్వహించి విషయాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఆ సమాచారం ప్రకారం దేశంలో 50 శాతం మంది మాస్కులు ధరించామా లేదు. ఇక ధరిస్తున్న 50 శాతం మందిలో… 64 శాతం మంది మాస్కుతో నోటిని కవర్ చేస్తున్నారు కానీ ముక్కును కవర్ చేయడం లేదు. 20 శాతం మంది గడ్డం పై, 2 శాతం మంది మెడపై మాస్కును ఉంచుకున్నారు. ఇక మిగిలిన 14 శాతం మంది మాత్రమే మాస్కును సరిగ్గా ధరిస్తున్నారు అని తెలిపింది.