Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Ed Raids Roshan Baig And Zameer Ahmed Khan In Ima Scam

వేల కోట్ల స్కామ్..! మాజీ మంత్రులకు ఈడీ షాక్..

Published Date :August 6, 2021 , 10:17 am
By Sudhakar Ravula
వేల కోట్ల స్కామ్..! మాజీ మంత్రులకు ఈడీ షాక్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

కర్ణాటక మాజీ మంత్రులను ఈడీ కేసులు వెంటాడుతున్నాయి… బెంగళూరులోని శివాజీనగర కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రోషన్ బేగ్ ఇంటిపై రైడ్‌ చేశారు ఈడీ అధికారులు.. కర్ణాటకలో గతంలో మంత్రిగా పనిచేసిన ఆయన.. వేల కోట్ల రూపాయల ఐఎంఏ స్కామ్‌ కేసులో రూ. 400 కోట్లు నొక్కేసినట్టు ఆరోపణలున్నాయి… దీంతో.. రోషన్ బేగ్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.. ఆయన ఇంటి నుంచి విలువైన పత్రాలు, డాక్యూమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.. ఐఏంఏ స్కామ్ కేసులో రోషన్ బేగ్ ఆస్తులు అటాచ్ చెయ్యాలని గతంలోనే ఈడీ అధికారులు కర్ణాటక ప్రభుత్వానికి మనవి చేశారు. ఇదే విషయంలో మాజీ మంత్రి రోషన్ బేగ్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేయడం కలకలం రేపుతోంది. అసలే కర్ణాటక పాలిటిక్స్‌ రసకందాయంలో ఉన్నాయి.. ప్రతిపక్షాలను టార్గెట్‌ చేసి కేసులు పెట్టడం… రైడ్స్‌ చేయిస్తున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి..

మరోవైపు.. రోషన్ బేగ్ ను 2020 నవంబర్ 23వ తేదీ సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. బెంగళూరులోని కోరమంగలలోని సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు రోషన్ బేగ్ ను హాజరుపరిచారు. రోషన్ బేగ్ జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించడంతో అప్పట్లో రోషన్ బేగ్ ను పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు పంపించారు. అదే జైల్లో ఐఎంఏ స్కామ్ ప్రధాన నిందితుడు మన్సూర్ ఆలీఖాన్ శిక్ష అనుభవిస్తున్నాడు. ఐఎంఏ స్కామ్ లో అప్పట్లో మన్సూర్ ఆలీ ఖాన్, రోషన్ బేగ్ ఒకే జైల్లో ఉన్నా వారిద్దరూ మాట్లాడుకోకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని చెబుతారు.. ఇక, కర్ణాటక మాజీ మంత్రి, చామరాజపేట నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జమీర్ అహమ్మద్ ఖాన్ కు ఈడీ అధికారులు షాక్ ఇచ్చారు. గురువారం బెంగళూరులోని శివాజీనగర సమీపంలోని కంటోన్మెంట్ ఏరియాలోని జమీర్ అహమ్మద్ ఖాన్ నివాసంలో, బెంగళూరులోని చామరాజపేటలోని ఆయన సొంత ట్రావెల్స్ అయిన నేషనల్ ట్రావెల్స్ కార్యాలయంలో, జమీర్ ఖాన్ కు చెందిన అపార్ట్ మెంట్స్ లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు ఈడీ అధికారులు.. కర్ణాటక రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన మాజీ మంత్రులైన రోషన్ బేగ్, జమీర్ అహమ్మద్ ఖాన్ నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు చెయ్యడం చర్చగా మారింది.

అయితే, ఐఎంఏ వ్యవస్థాపకుడు మన్సూర్ ఆలీఖాన్ తాను మాజీ మంత్రి రోషన్ బేగ్ కు రూ. 400 కోట్లు ఇచ్చానని, డబ్బులు తిరిగి ఇవ్వమంటే రౌడీలను పంపించి చంపేస్తానని బెదిరించాడని రోషన్ బేగ్ మీద గత ఏడాది సంచలన ఆరోపణలు చేశాడు. ఇదే కేసులో గత ఏడాది నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న రోసన్ బేగ్ కు 2020 నవంబర్ 23వ తేదీన సీబీఐ అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు. అరెస్ట్ చేసి జైలులో పెట్టారు.. ఐఎంఏ వ్యవస్థాపకుడు బెంగళూరుతో పాటు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రజలకు మోసం చేసి.. 2019లో దుబాయ్ పారిపోయాడు. 2019 జూన్ 6వ తేదీ న మన్సూర్ ఆలీఖాన్ దుబాయ్ నుంచి అప్పటి బెంగళూరు సిటీ పోలీసు కమిషనర్ టీ. సునీల్ కుమార్ కు ఓ వీడియో పంపించారు. తనకు ప్రాణహాని ఉందని, తనకు భద్రత కల్పిస్తే భారత్ వచ్చి లొంగిపోతానని మన్సూర్ ఆలీఖాన్ మనవి చేశాడు. దుబాయ్ లో మన్సూర్ ఆలీ ఖాన్ దెబ్బకు అప్పట్లో బెంగళూరులో కర్ణాటక మాజీ మంత్రి రోషన్ బేగ్ కు చుక్కలు కనిపించాయి.. కర్ణాటకలో అప్పటి కాంగ్రెస్- జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఐఎంఏ స్కామ్ కేసు విచారణకు ప్రత్యేకంగా ఎస్ఐటీని నియమించింది. అయితే కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వచ్చి బీఎస్. యడియూరప్ప సీఎం అయిన తరువాత ఐఎంఏ కేసును సీబీఐకి అప్పగించారు. 2019 నుంచి ఇప్పటి నుంచి ఇప్పటి వరకు సీబీఐ అధికారులు ఐఎంఏ స్కామ్ కేసు విచారణ చేస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. తాజా, ఈ కేసులో ఈడీ నోటీసులు, రైడ్స్‌ చర్చగా మారాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Zameer Ahmed

తాజావార్తలు

  • CM Revanth Reddy: సీఎం రేవంత్ కీలక నిర్ణయం.. రూ.225 కోట్లతో బాసర అభివృద్ధి!

  • Harish Rao: గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి.. మాజీ మంత్రి హరీష్‌రావు మాస్ రియాక్షన్..

  • Ramayan: ‘రామాయణ్’ రన్‌టైమ్ లీక్ చేసిన రణ్‌బీర్..

  • Raakaasaa:సంగీత్ శోభన్ ఖాతాలో మరో హిట్? ‘రాకాస’ మొదటి రోజు వసూళ్లు ఇవే!

  • Rahul Gandhi: మోడీ ఇప్పుడు ట్రంప్ నియంత్రణలో ఉన్నారు.. కేరళ ప్రచారంలో రాహుల్ గాంధీ విసుర్లు

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions