Ed A Mamma Reliance : ఆలియా భట్తో అంబానీ రూ.350 కోట్ల ‘బిజినెస్’ డీల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలివుడ్ నటి ఆలియా భట్ వరుస సినిమాలతో పాటు మరోవైపు పలు వ్యాపారాల్లో రానిస్తుంది.. గతంలో చిల్డ్రన్ వేర్ బ్రాండ్ను నెలకొల్పిన ఆలియా.. విజయవంతంగా దాన్ని నడిపిస్తున్నారు. అయితే, ఆ దుస్తుల కంపెనీని రిలయన్స్ అధినేత అంబానీ కొనుగోలు చేయనున్నట్లు సమాచారం.. అందుకోసం ఆలియా తో భారీ డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది..
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కూతురు ఇషా అంబానీ పలు వ్యాపారాలు చేస్తూ సక్సెస్ ఫుల్ ఉమెన్ గా దూసుకుపోతున్నారు.. ఆమె వ్యాపార విస్తరణలో భాగంగా ఈ డీల్ ఫైనల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం..రిలయన్స్ రిటైల్ వెంచర్స్లో భాగమైన రిలయన్స్ బ్రాండ్స్.. ఆలియా భట్కు చెందిన చిల్డ్రన్ వేర్ బ్రాండ్ ‘ఎడ్-ఎ-మమ్మా’ కంపెనీని కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది.. ఈ కంపెనీని రిలయన్స్ రిటైల్ రూ.300-రూ.350 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ బిజినెస్ డీల్ కు సంబందించిన ఫైనల్ చర్చ జరుగుతుందట.. మరో వారం రోజుల్లో ఈ భారీ డీల్ గురించి పూర్తి సమాచారం తెలియనుంది..
Also Read
- Jharkhand: దిగొచ్చిన హేమంత్ సర్కార్.. విద్యార్థుల డిమాండ్లకు అంగీకారం!
- Vishnu Deo Sai: రైతుగా మారిన ముఖ్యమంత్రి.. పొలం దున్నిన విష్ణు దేవ్
- Trump-Leavitt: ‘ఆమె నా కంటే ఎక్కువగా పిల్లలనే ప్రేమిస్తుంది’.. ట్రంప్ చమత్కారం
- Twisha Sharma: సీబీఐ ఛార్జ్షీట్లో ట్విషా శర్మ చివరి మాటలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వ్యాఖ్యలు
పిల్లల దుస్తుల విభాగంలో తమ ఉనికిని బలోపేతం చేసుకోవాలని యోచిస్తున్న ఇషా అంబానీ.. ఇప్పటికే పాపులర్ అయిన ఆలియా బ్రాండ్ను కొనుగోలు చేయాలని భావిస్తున్నారట.. అక్టోబర్ 2020లో ఆలియా భట్.. ఎడ్-ఎ-మమ్మా పేరుతో 2-14 వయసు గల చిన్నారులకు సంబంధించిన డ్రెస్సుల బిజినెస్ ను స్టార్ట్ చేశారు.. ఈ ఏడాది ఆరంభం నుంచి కొత్తగా బాలికలకు దుస్తులు, స్లీప్ సూట్లు, బాడీ సూట్లును కూడా విక్రయిస్తున్నారు. అయితే తన వ్యాప్తారాన్ని మరింతగా విస్తరించాలనుకుంటున్నట్లు కొన్నిరోజుల క్రితం ఆలియా వ్యాఖ్యానించారు. ఈలోపే రిలయన్స్ కొనుగోలు చేయనుందని వార్తలు రావడం గమనార్హం..గతేడాది ఆగస్టులో రిలయన్స్ రిటైల్ హెడ్గా ఇషా అంబానీని ముకేశ్ అంబానీ నియమించారు. అప్పటికి సంస్థ టర్నోవర్ రూ. 2 లక్షల కోట్లు.. జిమ్మీ చూ, జార్జియో అర్మానీ, హ్యూగో బాస్, వెర్సేస్, మైఖేల్ కోర్స్, బ్రూక్స్ బ్రదర్స్, అర్మానీ ఎక్స్ఛేంజ్, బుర్బెర్రీ లాంటి ప్రపంచస్థాయి బ్రాండ్లు మన దేశంలో రిలయన్స్ రిటైల్ తో భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి.. ఇక ఆలియా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు..
తాజావార్తలు
-
Off The Record: పరకాల టికెట్ ఆశలు గల్లంతైనట్లేనా..! కొండా ఫ్యామిలీకి సీఎం బిగ్ షాక్?
-
Jharkhand: దిగొచ్చిన హేమంత్ సర్కార్.. విద్యార్థుల డిమాండ్లకు అంగీకారం!
-
OTR: నరసాపురంలో కాపుల అసంతృప్తికి అసలు కారణం ఇదేనా..?
-
Off The Record: వనపర్తి కాంగ్రెస్లో రగులుతున్న లొల్లి! ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన చిన్నారెడ్డి
-
Vishnu Deo Sai: రైతుగా మారిన ముఖ్యమంత్రి.. పొలం దున్నిన విష్ణు దేవ్
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్బుక్లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!