రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు కొంతమంది రాష్ట్ర ఎన్నికల కమిషనర్లను ప్రత్యేక పరిశీలకులుగా ఆహ్వానించాలని అన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ల స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ ఆహ్వానం మేరకు చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను పర్యవేక్షించడానికి ప్రత్యేక పరిశీలకుడిగా రాష్ట్ర ఎన్నికల కమీషనర్, రిటైర్డు ఐ.ఎ.ఎస్. సి. పార్థసారధి చండీగఢ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ, ఇతర రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియను గమనిస్తే, SEC అనుసరించే వినూత్న చర్యలు మరియు ఉత్తమ పద్ధతులను పంచుకోవడానికి మరియు నేర్చుకోవడంలో సహాయపడుతుందన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా మరియు పారదర్శకంగా నిర్వహించడం, ఇతర రాష్ట్రాలలో ఎన్నికల నిర్వహణకు ఈ ఎన్నికలు ఉపయోగపడతాయన్నారు. గతంలో AP, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు మరియు మిజోరం మొదలైన వివిధ SECలు ఈ పద్ధతిని అనుసరించాయి. ప్రస్తుతం చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్కు ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 25 వరకు చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ ఎన్నికలను పర్యవేక్షించడానికి ప్రత్యేక పరిశీలకునిగా ఛండీగడ్ లో పర్యటిస్తున్నట్లు ఆయన తెలిపారు. స్థానిక గెస్ట్ హౌస్ లో సంబంధిత జిల్లా కలెక్టర్, మెజిస్ట్రేట్, ఐ.ఎ.ఎస్. అధికారి వినయ్ ప్రతాప్ సింగ్ మర్యాదపూర్వకంగా స్టేట్ ఎలక్షన్ కమీషనర్ సి. పార్థసారధిని కలిశారు. అనంతరం వివిధ రాష్ట్రాల ఎన్నికల కమీషనర్ల బృందంతో సి. పార్థసారధి చండీగఢ్, డిల్లీ స్టేట్ ఎలక్షన్ కమీషనర్, రిటైర్డు ఐ.ఎ.ఎస్. సంజయ్ కుమార్ శ్రీవాస్తవ్ ను కలుసుకున్నారు.
