పెగాసస్పై సీజేఐ కీలక వ్యాఖ్యలు.. సాంకేతిక నిపుణుల కమిటీ ఏర్పాటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తీవ్ర వివాదానికి దారి తీసిని పెగాసస్ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. పెగాసస్పై సాంకేతిక నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు.. కమిటీకి సంబంధించి వచ్చేవారం ఉత్తర్వులు ఇస్తామని పేర్కొంది సుప్రీంకోర్టు.. భారత పౌరులపై నిఘా కోసం ఇజ్రాయెల్ స్పైవేర్ పెగాసస్ ఉపయోగించారని ఆరోపణలు ఉన్నాయి.. దీనిపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తుందన్నారు భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ.. కాగా, ఇజ్రాయెల్ సాఫ్ట్వేర్ను తమ ఏజెన్సీలు ఉపయోగిస్తున్నాయో లేదో బహిరంగపరచడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరించడంతో కోర్టు సెప్టెంబర్ 13 న ఈ కేసులో తన ఆర్డర్ను రిజర్వ్ చేసింది. గత విచారణ సమయంలో.. కేంద్ర ప్రభుత్వం.. తన ఏజెన్సీల ద్వారా పెగాసస్ వినియోగంపై సమాచారం పంచుకోవడానికి.. పిటిషనర్లను అడ్డుకోవడానికి నిర్దిష్ట సమాచారాన్ని అందజేయడానికి నిరాకరించింది.
ఇక, న్యాయమూర్తులు సూర్య కాంత్ మరియు హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం, న్యాయస్థానం ఒక కమిటీని ఏర్పాటు చేయడం మరియు స్వతంత్ర విచారణకు సంబంధించిన ఇతర అనుబంధ అంశాలపై రాబోయే 3-4 రోజుల్లో మధ్యంతర ఉత్తర్వులను జారీ చేయనుంది.. అయితే, పెగాసస్ వ్యవహారంలో ఆగస్టు 16న ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్కు కట్టుబడి ఉన్నట్టు తెలిపారు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. పెగాసస్ వంటి నిర్దిష్ట సాఫ్ట్వేర్ని ఉపయోగించడంపై.. అఫిడవిట్ లేదా బహిరంగ చర్చకు సంబంధించిన అంశం కాదని పునరుద్ఘాటించారు. మంత్రులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, కార్యకర్తలు మరియు జర్నలిస్టుల ఫోన్లను హ్యాక్ చేయడానికి మిలిటరీ గ్రేడ్ స్పైవేర్ని ఉపయోగించడాన్ని ఈ అఫిడవిట్ ధృవీకరించలేదు.. ఇదే సమయంలో తిరస్కరించని సంగతి కూడా విదితమే. అయితే, ఇవాళ మాత్రం కీలక వ్యాఖ్యలు చేశారు సీజేఐ ఎన్వీ రమణ. పెగాసస్ స్నూపింగ్ వ్యవహారంలో విచారణకు సుప్రీం కోర్టు సాంకేతిక నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తోందని వెల్లడించారు..
Also Read
- RBI Bulletin: బలహీన రుతుపవనాలు ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపొచ్చు.. నిపుణుల హెచ్చరిక
- Qatar: ఖతార్ గ్యాస్ ప్లాంట్లో పేలుడు.. భారతీయుల సహా 13 మంది మృతి
- X Down: ‘ఎక్స్’కు అంతరాయం.. లక్షలాది మంది యూజర్లకు ఇక్కట్లు
- Kunal Shah: భారతీయ టెక్ దిగ్గజానికి కీలక బాధ్యతలు.. వాట్సాప్ గ్లోబల్ సీఈఓగా కునాల్ షా నియామకం
తాజావార్తలు
-
Tilak Varma: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. 136 పరుగులు సాధించి ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించిన వర్మ..
-
Qatar LNG Plant Explosion: 12 మంది భారతీయులు సహా 13 మంది మృతి.. అత్యవసర హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: బాల్కొండలో పొలిటికల్ ఫైట్.. ప్రశాంత్ రెడ్డికి చెక్ ఎవరు పెడతారు?
-
Off The Record: ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్ స్టార్ట్?
-
T20 World Cup: ప్రపంచకప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. ‘వెళ్లి షాపింగ్, హోటల్లో డిన్నర్లు చేసుకోండి’..
ట్రెండింగ్
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!