ఆ ఏడు సినిమాల పరిస్థితి ఏమిటీ!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత శుక్రవారం అంటే జూలై 30న ఐదు సినిమాలు విడుదలయ్యాయి. అందులో ‘తిమ్మరుసు’కు మంచి టాక్ వచ్చింది. కానీ థియేటర్లను పుల్ చేసేంత మాస్ అప్పీల్ హీరో సత్యదేవ్ కు లేకపోవడంతో కలెక్షన్లు ఓ మాదిరిగానే ఉన్నాయి. అలానే ఈ సినిమాతో పాటు విడుదలైన ‘ఇష్క్’కు నెగెటివ్ టాక్ వచ్చింది. దాంతో ఎవరూ ఆ మూవీ గురించి చర్చించడం లేదు. ఇక ఈ రెండు సినిమాతో పాటు వచ్చిన మరో మూడు సినిమాల గురించి కూడా జనాలు పట్టించుకోవడం లేదు.
తెలంగాణలో నూరు శాతం ఆక్యుపెన్సీ ఉన్నా, ఆంధ్రలో యాభై శాతం ఆక్యుపెన్సీనే ఉన్నా… ఇలాంటి సినిమాలకు తేడా ఉండదని చెబుతున్నారు. ఆ మధ్య కొంతమంది ఎగ్జిబిటర్స్ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని, సజ్జల రామకృష్ణారెడ్డిని విడివిడిగా కలిసి, టిక్కెట్ రేట్లు పెంచమని విన్నవించుకున్నారు. పైకి సానుకూలంగానే స్పందించినట్టు కనిపించినా, నగరాలలోని థియేటర్ల టిక్కెట్ రేటు పెంచే విషయంలో ప్రభుత్వం మరో ఆలోచన చేయడం లేదని తెలుస్తోంది. బి, సి సెంటర్స్ లోని థియేటర్ల టిక్కెట్ రేట్ విషయంలో కొంత మెత్తబడవచ్చని వార్తలు వస్తున్నాయి. గత నెల 30న ఆంధ్ర ప్రదేశ్ లో కేవలం పది శాతం థియేటర్లు మాత్రమే తెరచుకున్నాయి. దాంతో ఈ నెల మొదటివారంలో విడుదల కాబోతున్న ఏడు చిత్రాల పరిస్థితి ఏమిటనేది అగమ్య గోచరంగా ఉంది. పైగా ఆంధ్రలో రాత్రి కర్ఫ్యూను ఈ నెల 14 వరకూ పొడిగించారు. అందువల్ల కేవలం మూడు ఆటలే ప్రదర్శించాల్సిన పరిస్థితి.
Also Read
- Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
- Rahul Gandhi: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్పై కంగనా విమర్శలు.. ఆమె ఇష్టమని రాహుల్గాంధీ మద్దతు
- Tamil Nadu: పొట్టి దుస్తుల వైరల్ వీడియోపై మహిళ ఆవేదన.. బాధ్యతగా ఉండాలని విజ్ఞప్తి
- Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
జూలై 30న విడుదలైన సినిమాలకు పెద్దంత ఆదరణ లేకపోయినా… చిన్న సినిమాలు మాత్రం ఆగస్ట్ 6న విడుదలకు సిద్ధమైపోతున్నాయి. 5వ తేదీ ఆంగ్ల అనువాద చిత్రం ‘ది సూసైడ్ స్క్వాడ్’ విడుదల కాబోతుండగా, 6వ తేదీన ఏకంగా ఆరు సినిమాలు థియేటర్ల ముందు క్యూ కడుతున్నాయి. ఇందులో కిరణ్ అబ్బవరం నటించిన ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’తో పాటు శ్రీనివాసరెడ్డి హీరోగా నటించిన ‘ముగ్గురు మొనగాళ్ళు’ కూడా ఉంది. వీటితో పాటే ‘మెరిసే మెరిసే, మ్యాడ్, ఇప్పుడు కాక ఇంకెప్పుడు, క్షీర సాగర మధనం’ సినిమాలు విడుదల కాబోతున్నాయి.
మరి ఆంధ్రాలో థియేటర్లు ఇప్పటికైతే పదిశాతం తెరిచారు… ఆగస్ట్ 6 నాటికి మరో పది శాతం తెరిచే ఆస్కారం ఉందని అక్కడి ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ నేతలు చెబుతున్నారు. మరి అదే జరిగితే… ఇలా మొక్కుబడిగా తెరచుకునే థియేటర్లతో పంపణీదారులు, నిర్మాతలకు ఎలాంటి లాభం ఉండదు. ఒకవేళ జగన్ ప్రభుత్వం టిక్కెట్ రేట్లు పెంచడంతో పాటు ఆక్యుపెన్సీని నూరు శాతానికి అనుమతిస్తే, ‘లవ్ స్టోరీ, టక్ జగదీశ్’ వంటి సినిమాలు రిలీజ్ అయితే కొంతలో కొంత జనాలు థియేటర్లకు వచ్చే ఆస్కారం ఉంటుంది.





తాజావార్తలు
-
YS Jagan: ‘సీఎంగా ఏం చేస్తున్నా’ అని చంద్రబాబు ప్రశ్నించుకోవాలి.. వైఎస్ జగన్ ఫైర్!
-
Konda Murali: కొండా సురేఖ ఎపిసోడ్పై రాయబారం.. భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ..
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
King 100 Glimpse: నాగార్జున 100వ సినిమా ఫస్ట్ గ్లింప్స్కు డేట్ ఫిక్స్.. ఆ రోజు అసలు సర్ప్రైజ్
-
Nepal Floods: నేపాల్లో వరద బీభత్సం.. కొట్టుకుపోయిన గ్రామాలు.. 1,000 మందికి పైగా గల్లంతు!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!