డ్రాగన్ మరో కుట్ర… భూటాన్తో కీలక ఒప్పందం… పాక్కు అత్యాధునిక క్షిపణులు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియా చైనా దేశాల మధ్య 13 వ విడత చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. భారత్ ప్రతిపాదించిన ప్రతిపాదనలను చైనా తోసిపుచ్చింది. ఇక ఇదిలా ఉంటే చైనా మరో కొత్త కుట్రకు తెరలేపింది. భూటాన్ దేశంతో ఉన్న సరిహద్దు సమస్యను పరిష్కరించుకునేందుకు ముడు ప్రతిపాదనలు చేసింది. ఈ మూడు ప్రతి పాదనలకు భూటాన్ అంగీకారం తెలపడం భారత్కు ఇబ్బంది కలిగించే అంశంగా చెప్పవచ్చు. గత 37 ఏళ్లుగా భూటాన్, చైనా దేశాల మధ్య సరిహద్దు వివాదం నడుస్తున్నది. ఈ సరిహద్దు వివాదం పరిష్కరించుకోవడమే కాకుండా, బీఆర్ఐ పథకానికి ఆమోదం తెలిపితే, భూటాన్ సరిహద్దుల్లో చైనా అభివృద్ది కార్యక్రమాల పేరిట రోడ్డు మార్గాలను ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఇండియా భూటాన్ సరిహద్దుల్లో శిలిగుడి కారిడార్ ఉన్నది. ఈ కారిడార్ భారత్కు కీలకమైనది. దీనిని చికెన్ నెక్ కారిడార్ గా పిలుస్తారు. ఇది భారత్ను ఈశాన్యరాష్ట్రాలతో కలిపే కారిడార్. ఈ కారిడార్పై చైనా కన్నేసే అవకాశం ఉన్నది. చైనా మూడు అంచెల ప్రతిపాధనలను భూటాన్ అంగీకరించడంతో ఈశాన్య రాష్ట్రాల్లో భారత్ తన నిఘాను పెద్ద ఎత్తున పెంచింది. ఇకపోతే, పాకిస్తాన్కు చైనా హెచ్క్యూ 9 క్షిపణులను సరఫరా చేసింది. ఈ క్షిపణులను రష్యా ఎస్ 300 క్షిపణీ వ్యవస్థను పోలి ఉంటుంది. శతృదేశాలకు చెందిన విమానాలు తమ గగనతలంలోకి ప్రవేశిస్తే వాటిని ముందుగానే పసిగట్టి కూల్చివేసే సత్తా హెచ్క్యూ 9 క్షిపణులకు ఉంటుంది. వీటిని పాక్ కు సరఫరా చేయడమే కాకుండా ఇండియాకు కూతవేటు దూరంలో ఉన్న షిన్జియాంగ్ ప్రావిన్స్లో కూడా మోహరించడంతో చైనా పెద్ద కుట్రకు పాల్పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Read: లైవ్: బండారు దత్తాత్రేయ అలయ్ బలయ్…
Also Read
- Trump-Israel: ఇజ్రాయెల్కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
- Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
- Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
- UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
తాజావార్తలు
-
CBI Case: అమెరికా మిషనరీ సంస్థపై CBI కేసు.. 1,000కుపైగా విదేశీ డెబిట్ కార్డుల వ్యవహారం!
-
Disha Salian Case: ‘‘ఆమె ఎవరో నాకు తెలియదు’’.. దిశా కేసుపై ఆదిత్య ఠాక్రే కామెంట్స్..
-
Sangareddy: వినాయక నిమజ్జనంలో అపశృతి.. 6 మంది విద్యార్థులు మృతి
-
CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
-
Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!