డ్రాగన్ మరో కుట్ర… భూటాన్తో కీలక ఒప్పందం… పాక్కు అత్యాధునిక క్షిపణులు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియా చైనా దేశాల మధ్య 13 వ విడత చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. భారత్ ప్రతిపాదించిన ప్రతిపాదనలను చైనా తోసిపుచ్చింది. ఇక ఇదిలా ఉంటే చైనా మరో కొత్త కుట్రకు తెరలేపింది. భూటాన్ దేశంతో ఉన్న సరిహద్దు సమస్యను పరిష్కరించుకునేందుకు ముడు ప్రతిపాదనలు చేసింది. ఈ మూడు ప్రతి పాదనలకు భూటాన్ అంగీకారం తెలపడం భారత్కు ఇబ్బంది కలిగించే అంశంగా చెప్పవచ్చు. గత 37 ఏళ్లుగా భూటాన్, చైనా దేశాల మధ్య సరిహద్దు వివాదం నడుస్తున్నది. ఈ సరిహద్దు వివాదం పరిష్కరించుకోవడమే కాకుండా, బీఆర్ఐ పథకానికి ఆమోదం తెలిపితే, భూటాన్ సరిహద్దుల్లో చైనా అభివృద్ది కార్యక్రమాల పేరిట రోడ్డు మార్గాలను ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఇండియా భూటాన్ సరిహద్దుల్లో శిలిగుడి కారిడార్ ఉన్నది. ఈ కారిడార్ భారత్కు కీలకమైనది. దీనిని చికెన్ నెక్ కారిడార్ గా పిలుస్తారు. ఇది భారత్ను ఈశాన్యరాష్ట్రాలతో కలిపే కారిడార్. ఈ కారిడార్పై చైనా కన్నేసే అవకాశం ఉన్నది. చైనా మూడు అంచెల ప్రతిపాధనలను భూటాన్ అంగీకరించడంతో ఈశాన్య రాష్ట్రాల్లో భారత్ తన నిఘాను పెద్ద ఎత్తున పెంచింది. ఇకపోతే, పాకిస్తాన్కు చైనా హెచ్క్యూ 9 క్షిపణులను సరఫరా చేసింది. ఈ క్షిపణులను రష్యా ఎస్ 300 క్షిపణీ వ్యవస్థను పోలి ఉంటుంది. శతృదేశాలకు చెందిన విమానాలు తమ గగనతలంలోకి ప్రవేశిస్తే వాటిని ముందుగానే పసిగట్టి కూల్చివేసే సత్తా హెచ్క్యూ 9 క్షిపణులకు ఉంటుంది. వీటిని పాక్ కు సరఫరా చేయడమే కాకుండా ఇండియాకు కూతవేటు దూరంలో ఉన్న షిన్జియాంగ్ ప్రావిన్స్లో కూడా మోహరించడంతో చైనా పెద్ద కుట్రకు పాల్పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Read: లైవ్: బండారు దత్తాత్రేయ అలయ్ బలయ్…
Also Read
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
- Rahul Gandhi: విద్యార్థులు ఒంటరి కాదు.. అండగా ఉంటాం.. ఇండియా కూటమి ప్రకటన
- Ahmedabad: అహ్మదాబాద్ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?