తెలంగాణలో జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికలో విజయం సాధించడంతో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఆ పార్టీ నేతలు ఫుల్ జోష్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో త్వరలో వేములవాడ ఉపఎన్నిక వస్తుందని జోస్యం చెప్పారు. అలాగే తమతో ఐదుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మరికొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని రఘునందన్రావు పేర్కొన్నారు.
Read Also: కేసీఆర్కు ప్రజలు బాగా బుద్ధి చెప్పారు: షర్మిల
కాగా ప్రస్తుతం వేములవాడ ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ నేత చెన్నమనేని రమేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఆయన పౌరసత్వంపై బీజేపీ ఆరోపణలు చేస్తోంది. ఆయనది భారతీయ పౌరసత్వం కాదని, ఆయనకు ఇంకా జర్మనీ పౌరసత్వం ఉందని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. భారత పౌరసత్వం లేకుండా ఎమ్మెల్యేగా ఉండే అర్హత చెన్నమనేని రమేష్కు లేదంటూ బీజేపీ వాదిస్తోంది. ప్రస్తుతం ఈ కేసు న్యాయస్థానం పరిధిలో ఉంది. అయితే తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని బీజేపీ ఆశిస్తోంది. దీంతో వేములవాడలో త్వరలో ఉప ఎన్నిక జరుగుతుందని ఆ పార్టీ నేతలు బాహాటంగా ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాబోయే వేములవాడ ఉపఎన్నికలోనూ బీజేపీ విజయం సాధిస్తుందని రఘునందన్ ధీమా వ్యక్తం చేశారు.