రైతుల మహాపాదయాత్రకు బీజేపీ సంఘీభావం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతిని ఏకైక రాజధానిగా వుంచాలంటూ రైతులు, ప్రజాసంఘాలు మహాపాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. రేపు రాజధాని రైతుల మహా పాదయాత్రలో పాల్గొననున్నారు ఏపీ బీజేపీ అగ్ర నేతలు. పాదయాత్రలో బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు, సుజనా చౌదరి, సీఎం రమేష్, పురంధేశ్వరీ, సత్య కుమార్ పాల్గొని సంఘీభావం తెలపాలని నిర్ణయించారు.
రాజధాని రైతులను కలిసి సంఘీభావం తెలుపుతామని ఏపీ బీజేపీ అగ్ర నేతలు ప్రకటించారు. కేంద్రం హోం మంత్రి అమిత్ షా ఆదేశాలతో రాజధాని రైతుల పాదయాత్రలో పాల్గొనాలని ఏపీ బీజేపీ నిర్ణయం తీసుకుంది. రాజధాని రైతుల పాదయాత్ర ఏపీలో ఏర్పడిన వాతావరణ పరిస్థితుల వల్ల ముందుకు సాగడం లేదు. రైతుల మహా పాదయాత్ర న్యాయస్థానం టు దేవస్థానం రెండు రోజులుగా ప్రకాశం జిల్లా గుడ్లూరులో ఆగింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉండటంతో యాత్రకు విరామం ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రకటించిన తేదీకల్లా తిరుమల చేరుతామని రైతులు విశ్వాసం వ్యక్తంచేస్తున్నారు.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Kiren Rijiju: లాక్డౌన్పై కిరణ్ రిజిజు క్లారిటీ.. పొదుపు మంత్రం వేళ కీలక వ్యాఖ్యలు

స్థానిక జేఏసీ నేతలు పాదయాత్రలోని రైతులకు, మహిళల వసతి, సౌకర్యాలు కల్పిస్తున్నారు. రైతులంతా స్థానిక కల్యాణ మండపాల్లో బస చేశారు. ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించాలంటూ వారు నినాదాలు చేశారు. వ్యవసాయ చట్టాల రద్దుపై మోడీ నిర్ణయం తీసుకున్నట్లే మూడు రాజధానులకు వ్యతిరేకంగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని అమరావతి ఐక్య కార్యాచరణ సమితి నేతలు కోరారు. అమరావతి రైతుల పాదయాత్రకు బీజేపీ నేతలు మద్దతు తెలపడంతో వారేం మాట్లాడతారోనన్న ఉత్కంఠ నెలకొంది.20 రోజులుగా ఈ యాత్ర అప్రతిహతంగా సాగుతోంది. మొత్తం 45 రోజుల పాటు యాత్ర సాగనుంది. తిరుమలలో యాత్ర ముగుస్తుంది.
తాజావార్తలు
-
RCB Vs PBKS: ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లిన ఆర్సీబీ.. వరుసగా ఆరో ఓటమి చవిచూసిన పంజాబ్..
-
Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
-
Pichi Potta Chicken : నోరూరించే ‘పిచి పొట్టా చికెన్’.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఇలా ఈజీగా చేసుకోండి.!
-
Manoj Manchu: మంచు మనోజ్ దంపతుల సంచలన నిర్ణయం.. ఐదుగురు పిల్లల దత్తత!
-
Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..