రైతుల మహాపాదయాత్రకు బీజేపీ సంఘీభావం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతిని ఏకైక రాజధానిగా వుంచాలంటూ రైతులు, ప్రజాసంఘాలు మహాపాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. రేపు రాజధాని రైతుల మహా పాదయాత్రలో పాల్గొననున్నారు ఏపీ బీజేపీ అగ్ర నేతలు. పాదయాత్రలో బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు, సుజనా చౌదరి, సీఎం రమేష్, పురంధేశ్వరీ, సత్య కుమార్ పాల్గొని సంఘీభావం తెలపాలని నిర్ణయించారు.
రాజధాని రైతులను కలిసి సంఘీభావం తెలుపుతామని ఏపీ బీజేపీ అగ్ర నేతలు ప్రకటించారు. కేంద్రం హోం మంత్రి అమిత్ షా ఆదేశాలతో రాజధాని రైతుల పాదయాత్రలో పాల్గొనాలని ఏపీ బీజేపీ నిర్ణయం తీసుకుంది. రాజధాని రైతుల పాదయాత్ర ఏపీలో ఏర్పడిన వాతావరణ పరిస్థితుల వల్ల ముందుకు సాగడం లేదు. రైతుల మహా పాదయాత్ర న్యాయస్థానం టు దేవస్థానం రెండు రోజులుగా ప్రకాశం జిల్లా గుడ్లూరులో ఆగింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉండటంతో యాత్రకు విరామం ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రకటించిన తేదీకల్లా తిరుమల చేరుతామని రైతులు విశ్వాసం వ్యక్తంచేస్తున్నారు.
Also Read
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?
- CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
- UP: ఘజియాబాద్లో దారుణం.. రూ.150 కోట్ల ఆస్తి కోసం తండ్రిని కాల్చిచంపిన కొడుకు

స్థానిక జేఏసీ నేతలు పాదయాత్రలోని రైతులకు, మహిళల వసతి, సౌకర్యాలు కల్పిస్తున్నారు. రైతులంతా స్థానిక కల్యాణ మండపాల్లో బస చేశారు. ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించాలంటూ వారు నినాదాలు చేశారు. వ్యవసాయ చట్టాల రద్దుపై మోడీ నిర్ణయం తీసుకున్నట్లే మూడు రాజధానులకు వ్యతిరేకంగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని అమరావతి ఐక్య కార్యాచరణ సమితి నేతలు కోరారు. అమరావతి రైతుల పాదయాత్రకు బీజేపీ నేతలు మద్దతు తెలపడంతో వారేం మాట్లాడతారోనన్న ఉత్కంఠ నెలకొంది.20 రోజులుగా ఈ యాత్ర అప్రతిహతంగా సాగుతోంది. మొత్తం 45 రోజుల పాటు యాత్ర సాగనుంది. తిరుమలలో యాత్ర ముగుస్తుంది.
తాజావార్తలు
-
PV Sindhu: జపాన్ ఓపెన్లో పీవీ సింధు చరిత్ర.. 16 ఏళ్ల తర్వాత సెమీస్లోకి దూసుకెళ్లిన రెండో భారత మహిళా షట్లర్
-
Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
-
Delhi Police Commissioner: ఢిల్లీకి కొత్త పోలీస్ బాస్.. ఎవరు ఈ అనురాగ్ కుమార్..?
-
Hydrogen Fuel Cell Train: తొలి “హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్” రైలు షురూ.. రూ.14,700 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం..!
-
TamannaahBhatia : బోల్డ్ హారర్ థ్రిల్లర్లో తమన్నా భాటియా.. రసహృదయాలు కాస్త జాగ్రత్త
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?