NTV Telugu Site icon

సీడీఎస్ బిపిన్ రావ‌త్ క‌న్నుమూత‌… ధృవీక‌రించిన ఆర్మీ…

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ బిపిన్ రావ‌త్ క‌న్నుమూశారు.  ఈరోజు క‌నూరులో జ‌రిగిన హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో బిపిన్ రావ‌త్ మృతి చెందిన‌ట్టు ఇండియ‌న్ ఆర్మీ ధృవీక‌రించింది.  ఉటీ స‌మీపంలోని వెల్డింగ్ట‌న్ డిఫెన్స్ కాలేజీలో లెక్చ‌ర్ ఇచ్చేందుకు ఢిల్లీ నుంచి ప్ర‌త్యేక విమానంలో సూలూరు ఎయిర్ బేస్ కు చేరుకున్నారు.  సూలూరు ఎయిర్ బేస్ నుంచి ఎంఐ 17 హెలికాప్ట‌ర్‌లో వెల్టింగ్ట‌న్ కు బ‌య‌లుదేరి వెళ్లారు.  వెల్డింగ్ట‌న్‌కు 16 కిలోమీట‌ర్ల దూరంలో హ‌ఠాత్తుగా హెలికాప్టర్ కూలిపోయింది.  ఈ ప్ర‌మాదంలో  13 మంది మృతి చెందారు.  ఇందులో బిపిన్ రావ‌త్ కూడా ఉన్నట్టు ఇండియ‌న్ ఆర్మీ దృవీక‌రించింది. 

Read: యూర‌ప్‌లో పెరుగుతున్న కేసులు… ఆసుప‌త్రుల వ‌ద్ద భారీ క్యూలు…