హైదరాబాద్ లో కలకలం రేపుతున్న డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాలానగర్ డ్రగ్స్ కేసులో ఎల్బీ నగర్ కోర్ట్ లో లొంగిపోయారు నిందితులు. గతంలో ఇంజనీరింగ్ స్టూడెంట్ సాయి కుమార్ నుండి డ్రగ్స్ ను సీజ్ చేశారు బాలానగర్ ఎక్సైజ్ పోలీసులు. సాయి కుమార్ కు డ్రగ్స్ ను సప్లై చేశారు నిందితులు రామకృష్ణ గౌడ్ , హనుమంత రెడ్డి.
ఇద్దరు డ్రగ్స్ నిందితులను మూడు రోజులు పాటు కష్టడీ కి తీసుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. చింతల్ లోని గణేష్ నగర్ లో ఎక్సైజ్ పోలీసులు సోదాలు చేశారు. నిందితుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు ఎక్సైజ్ పోలీసులు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ను టార్గెట్ గా చేసుకొని డ్రగ్స్ , గంజాయిని సప్లై చేస్తున్నారు నిందితులు. హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలంపై ప్రభుత్వం సీరియస్ అయింది.
