Site icon NTV Telugu

ముగిసిన కివీస్ ఇన్నింగ్స్… ఆసీస్ టార్గెట్..?

యూఏఈ లో జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో ఈరోజు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్స్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో టాస్ ఒదిన కారణంగా మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో కివీస్ కెప్టెన్ విలియమ్సన్ అర్ధశతకంతో రాణించాడు. మొత్తం 48 బంతుల్లో 85 పరుగులు చేసాడు. మిగిలిన వారు పర్వాలేదు అనిపించారు. అలాగే ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హేజిల్‌వుడ్ 3 వికెట్లు తీయగా… ఆడమ్ జంపా ఒక వికెట్ ను తీసాడు. ఇక ఈ మ్యాచ్ లో గెలిచి ప్రపంచ కప్ ను సొంతం చేసుకోవాలంటే… ఆసీస్ నిర్ణిత ఓవర్లలో 173 పరుగులు చేయాలి. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధించి ప్రపంచ కప్ ను సొంతం చేసుకుంటారు అనేది.

Exit mobile version