Site icon NTV Telugu

రాజధాని కేసులపై విచారణ… హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు

అమరావతి రాజధాని కేసులపై హైకోర్టులో విచారణ ప్రారంభం అయింది. రాజధాని కేసుల నుంచి న్యాయమూర్తులు సత్యనారాయణ మూర్తి, సోమయాజులను తప్పించాలని ప్రభుత్వం తరపు న్యాయవాది దుష్యంత్ దవే పిటిషన్ వేశారు. రాజధానిలో ఆ ఇద్దరు న్యాయమూర్తులకు భూములున్నాయని.. వారిని ధర్మాసనం తప్పించాలని కోరారు దుష్యంత్ దవే. గతంలో ఇవే పిటిషన్లపై విచారణ చేపడుతోన్నప్పుడు ఎందుకు అభ్యంతరం తెలపలేదని హైకోర్టు ప్రశ్నించింది.

న్యాయమూర్తులపై ప్రభుత్వ అభ్యంతర పిటిషన్‌ని కొట్టేసింది హైకోర్టు. తాము అభ్యంతరం తెలిపామనే విషయాన్ని తీర్పులో ప్రస్తావించాలని ప్రభుత్వం తరపు న్యాయవాది కోరారు. అమరావతి రాజధాని కేసులు దీర్ఘ కాలంగా పెండింగులో ఉండడం వల్ల రాజధాని రైతులు.. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాజధాని కేసులను సత్వరం విచారణ పూర్తి చేస్తామంది హైకోర్టు. రాజధాని రైతుల తరపున వాదనలు వినిపిస్తున్నారు శ్యామ్ దివాన్.

Exit mobile version