అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. యూపీ ఎన్నికలు జరిగేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ను ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ టెన్షన్ పెడుతోంది.. పాజిటివ్ కేసులు క్రమంగా పెరిగిపోతున్నాయి.. ఇప్పటికే అన్ని రాష్ట్రాలు ఆంక్షల బాట పడుతున్నాయి. ఈ క్రమంలో వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్తో పాటు పంజాబ్, ఉత్తారాఖండ్, గోవా, మణిపూర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై అనుమానాలు మొదలయ్యాయి.. ఒమిక్రాన్ విజృంభిస్తోన్న సమయంలో యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయా? లేక వాయిదా వేస్తారా? అనే చర్చ సాగుతోంది. ఎన్నికల ప్రచారం, సభలు అంటే వేలాదిగా మంది గుమిగూడే పరిస్థితి ఉంటుంది.. వేగంగా వైరస్ వ్యాప్తిచెందే అవకాశం ఉంటుంది.. దీంతో ఎన్నికల నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. ఒమిక్రాన్ విస్తరిస్తోండడంతో.. అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.. ఒమిక్రాన్ వేరియంట్ దృష్ట్యా వచ్చే ఏడాది జరిగే యూపీ ఎన్నికలను రెండు, మూడు నెలల పాటు వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ను రిక్వెస్ట్ చేసింది.
అలాగే రాష్ట్రంలో జరిగే బహిరంగసభలు, ర్యాలీపై నిషేధం విధించాలని ప్రధాని నరేంద్ర మోడీని కూడా కోరింది అలహాబాద్ హైకోర్టు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కొత్త వేరియంట్ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని.. అందుకే ర్యాలీలు నిలిపివేయాలని కోరింది. లేదంటే యూపీలో ఒమిక్రాన్ కేసులు భారీ సంఖ్యలో నమోదు అయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ఎన్నికల సంఘానికి కీలక సూచనలు చేసిన అలహాబాద్ హైకోర్టు.. ఒమిక్రాన్ వేరియంట్ ముప్పు కారణంగా రానున్న అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేసే ఆలోచనలు చేయాలని సూచించింది. ఈ అసెంబ్లీ ఎన్నికలను రెండు నెలలు వాయిదా వేయాలని కోరింది. కరోనా కేసులు పెరగకుండా.. మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇక, ర్యాలీలు, బహిరంగ సభలు, కార్యక్రమాలపై నిషేధం విధించాలని సూచించిన కోర్టు.. ఎన్నికల కోసం ప్రచారం చేయాలనుకుంటే రాజకీయ పార్టీలు టీవీలు, న్యూస్ పేపర్లనూ ఎంచుకోవచ్చు అని అభిప్రాయపడింది.. ప్రాణాలు ఉంటేనే మిగతా అంతా కూడా అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది హైకోర్టు. దీంతో.. వచ్చే ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం పునరాలోచన చేస్తుందా..? హైకోర్టు సూచలన ప్రకారం యూపీ సహా మిగతా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
Also Read
- UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
- Delhi: బ్రిక్స్ డ్యూటీలో సెక్యూరిటీ సిబ్బంది తుపాకీలతో రీల్స్.. ఒకరు సస్పెండ్
- Central Cabinet Decision: ఉద్యోగులకు కేంద్రం గుడ్న్యూస్.. ఈపీఎఫ్ పరిమితి పెంపు
- US: బస్సు ప్రమాదాన్ని కవర్ చేస్తూ కూలిన మీడియా హెలికాప్టర్.. ముగ్గురు మృతి
- Tags
తాజావార్తలు
-
Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
-
Sharanya: ‘లైఫ్ ఆగమాగం చేశారు.. బాబును జాగ్రత్తగా చూసుకోండి’ ఈశ్వర్ సాయి భార్య ఆత్మహత్యాయత్నం..
-
Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
-
Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
-
UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!