Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Aam Aadmi Party Next Target Rajasthan

Aam Aadmi Party: కాంగ్రెస్, బీజేపీ ఖో-ఖో.. ఇక చెల్లదు పో.. అంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ. రాజస్థాన్‌లోనూ రాణిస్తుందా?

Published Date :July 18, 2022 , 9:24 am
By Akkirala Kondala Rao
Aam Aadmi Party: కాంగ్రెస్, బీజేపీ ఖో-ఖో.. ఇక చెల్లదు పో.. అంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ. రాజస్థాన్‌లోనూ రాణిస్తుందా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Aam Aadmi Party: ఇప్పటికే జాతీయ రాజధాని ఢిల్లీలో అధికారంలో పాతుకుపోయిన ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) రీసెంట్‌గా పంజాబ్‌లోనూ పవర్‌లోకి వచ్చింది. లేటెస్టుగా మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీ మునిసిపల్‌ ఎన్నికల్లో మేయర్‌ పీఠాన్ని దక్కించుకోవటం ద్వారా ఆ రాష్ట్రంలో అకౌంట్‌ తెరిచింది. మధ్యప్రదేశ్‌లో ఇండోర్‌ తర్వాత పెద్ద మునిసిపల్‌ కార్పొరేషన్‌ సింగ్రౌలీ. కాబట్టి ఆప్‌ సొంతం చేసుకున్న ఈ విజయం విశేషమనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఈ పార్టీ మరో రాష్ట్రం పైన ఫోకస్‌ పెట్టింది. అదే.. రాజస్థాన్‌. అక్కడ కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు ఆడుతున్న ఖో-ఖో ఆట ఇక చెల్లదు పో అంటోంది.

రాజస్థాన్‌లో ఈ రెండు పార్టీలు రాజకీయంగా లోపాయికారీ ఒప్పందాన్ని కుదుర్చుకొని రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టాయని ఆప్‌ విమర్శిస్తోంది. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే విషయాన్ని ఎన్నికలకు ముందు ప్రకటించలేని దురవస్థ కాంగ్రెస్‌, బీజేపీలదని ఆప్‌ రాజ్యసభ ఎంపీ సందీప్‌ పాఠక్‌ ఎద్దేవా చేశారు. పంజాబ్‌లో ఆప్‌ అనూహ్య విజయం వెనక ఉన్న స్ట్రాటజిస్ట్‌ ఈయనే. రాజస్థాన్‌లో మరో ఏడాదిలో అసెంబ్లీ ఎలక్షన్‌ జరగనుంది. అక్కడ ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉంది. ఆ రాష్ట్రంలో రానున్న రోజుల్లో ఆప్‌ అనుసరించనున్న వ్యూహాన్ని సందీప్‌ పాఠక్‌ మీడియాతో పంచుకున్నారు.

Also Read

  • FTA: ఇరాన్ యుద్ధం గొడవలో ప్రపంచం.. సైలెంట్‌గా కీలక ఒప్పందాన్ని పూర్తి చేసిన భారత్..
  • PM Modi: మే 4 తర్వాత బెంగాల్‌లో మాఫియా, గుండాల అంతం ఖాయం..
  • Love Marriage: నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇంతలోనే ఘోరం
  • AAP Crisis: హర్భజన్ సహా బీజేపీలో చేరిన ఎంపీలకు భారీ భద్రత..

Read Also: B.Sc. Formula: బీఎస్సీ అంటే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ కాదు!. బ్రాహ్మణులు, షెడ్యూల్డ్‌ కులాలట

“స్థానికుణ్నే సీఎం చేస్తాం” అనే ప్రచారంతో ముందుకెళతామని చెప్పారు. బీజేపీ అంతర్గత కుమ్ములాటలతో అతలాకుతలం అవుతూ ప్రధాని మోడీ పేరు, ఫొటో చూపి ఓట్లు వేయించుకోవాలనుకుంటోందని తప్పుపట్టారు. జాతీయ నాయకుడి (మోడీ) గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నారని, ఇవి లోక్‌సభ ఎన్నికలు కావు కదా అని ఆయన ప్రశ్నించారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ రాజస్థాన్‌లోని మొత్తం 200 ఎమ్మెల్యే స్థానాల్లో పూర్తి సన్నద్ధతతో పాల్గొంటుందని ప్రకటించారు. ఎన్నికలకు ముందు సర్వే చేస్తామని, తద్వారా వాస్తవ పరిస్థితులపై ఒక అంచనాకు వస్తామని, జనం ఏం కోరుకుంటున్నారో తెలుస్తుందని సందీప్‌ పాఠక్‌ అన్నారు.

ఏ అభ్యర్థికైతే విజయవకాశాలు ఎక్కువగా ఉంటాయో, ప్రజల్లో ఎవరికైతే గుడ్‌ ఇమేజ్‌ ఉందో వాళ్లనే బరిలోకి దింపుతామని, ఆయా క్యాండేట్లను సర్వే ఫలితాల ఆధారంగా నిర్ణయిస్తామని తెలిపారు. పంజాబ్‌లోనూ ఇదే ప్రణాళికను అమలుచేసి సక్సెస్‌ అయ్యామని గుర్తుచేసుకున్నారు. నాయకులకే కాకుండా క్రియాశీలక కార్యకర్తలకు కూడా ఆప్‌ టికెట్లు కేటాయిస్తామని వెల్లడించారు. నిజం చెప్పాలంటే పంజాబ్‌లో పాలనా పగ్గాలు చేపట్టిన వెంటనే ఆప్‌ రాజస్థాన్‌లో ఎలక్షన్‌ ప్రిపరేషన్‌పై దృష్టిపెట్టింది. ప్రస్తుతం ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఆప్‌ ప్రాతినిధ్యం సున్నా. జీరో నుంచి హీరో లెవల్‌కి ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది.

కాంగ్రెస్‌, బీజేపీ ఈ రెండు పార్టీల్లో ఏది అధికారంలో ఉన్నా రాజస్థాన్‌కి ఒరిగిందేమీలేదని ఆప్‌ అంటోంది. సామాన్యుల సమస్యలను అవి గాలికొదిలేశాయని మండిపడుతోంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ రాజస్థాన్‌లో ఇప్పటికే మిస్డ్‌ కాల్స్‌తో మెంబర్‌షిప్‌ డ్రైవ్‌ని చేపట్టింది. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు ‘గ్రామ్‌ సంపర్క్‌ అభియాన్‌’కి శ్రీకారం చుట్టి స్థానికులతో సత్సంబంధాలను మెయిన్‌టెయిన్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో మాదిరిగానే రాజస్థాన్‌లోనూ ఆప్‌ రాణిస్తుందా అనే ఆసక్తి నెలకొంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Aam Aadmi Party
  • aap mp
  • opposition party bjp
  • punjab aap strategist
  • rajasthan politics

తాజావార్తలు

  • Salim Dola: టర్కీలో దొరికిన దావూద్ రైట్ హ్యాండ్.. భారత్ మాస్టర్ ప్లాన్ హిట్!

  • LSG vs KKR: కోల్‌కతాపై పంజా విసిరిన మోసిన్ ఖాన్.. దంచికొట్టిన రింకూ.. లక్నో టార్గెట్ ఎంతంటే?

  • Telangana: సైబర్ నేరస్థుల వేటలో తెలంగాణ పోలీస్.. “ఆపరేషన్ క్రాక్‌డౌన్ 2.0” ప్రారంభం.!

  • IPL 2026: 8 మ్యాచ్‌లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..

  • Realme C100x: రియల్‌మీ C100x భారత్‌లో త్వరలో లాంచ్.. 8000mAh బ్యాటరీతో బిగ్ సర్‌ప్రైజ్!

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions