NTV Telugu Site icon

4 నెలల డెడ్‌లైన్‌.. టీఎస్‌ఆర్టీసీ ప్రైవేట్‌ పరం..?

ఆర్టీసీ ఛైర్మన్ బాజి రెడ్డి గోవర్దన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాలుగు ఐదు నెలల్లో ఆర్టీసీ గాడిలో పడకపోతే సంస్థను ప్రైవేట్ పరం చేస్తామని సీఎం కేసీఆర్‌ చెప్పారన్నారు. సంస్థ ఉద్యోగులు ఈ విషయాన్ని గుర్తెరిగి పని తీరు మెరుగు పర్చుకోవాలని సూచించారు బాజిరెడ్డి.. ఇక, ఆర్టీసీ యూనియన్‌ రద్దు చేసిన తర్వాత.. సంక్షేమ మండలి ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని.. ఒక ఆడ, ఒక మగ అధికారులతో కమిటీ ఉంటుందని.. సమస్యలు ఏవైనా ఉంటే చర్చించి పరిష్కరిస్తారన్నారు. కాగా, నిన్న ఆర్టీసీ పరిస్థితిపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్.. ఛార్జీల పెంపు ప్రతిపాదలను సిద్ధం చేయాలని ఆదేశించారు.. ఆర్టీసీ గాడిలో పడే సమయంలో.. కరోనా, పెట్రో ధరలు పెరగడం.. ప్రతీకూలంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు కేసీఆర్.