తులం బంగారం కొనుగోలు చేయాలంటే బోలెడు డబ్బులు పోయాలి. బంగారం ఆభరణాల రూపంలోనే కాదు, తినే వస్తువులుగా కూడా మార్చుకోవచ్చు. వీటిని ఇడబుల్ గోల్డ్ అని పిలుస్తారు. 24 క్యారెట్ల ఇడబుల్ గోల్డ్ను పేపర్లా మార్చి తినేందుకు వినియోగిస్తుంటారు. ఈ ఇడబుల్ గోల్డ్ తో ఐస్క్రీమ్ను కూడా తయారు చేయవచ్చట. ఈ 24 క్యారెట్ల ఐస్క్రీమ్ కావాలి అంటే హాంకాంగ్ వరకు వెళ్లాల్సిందే. ఐస్క్రీమ్ పైన 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన పలుచని పేపర్ ను ఉంచుతారు. చూసేందుకు అది గోల్డ్ ఐస్క్రీమ్ మాదిరిగా కనిపిస్తుంది. దీని విలువ సుమారు రూ. 1000. హాంకాంగ్ వెళ్లిన సెలబ్రిటీలు తప్పకుండా ఈ ఐస్క్రీమ్ను తింటుంటారు. భారతీయ సెలబ్రిటీల ప్రమోషన్తో ఒక్కసారిగా ఈ ఐస్క్రీమ్ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది.