విజయ్ ‘బీస్ట్’పై కన్నేసిన బాలీవుడ్ మెగా ప్రొడ్యూసర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దళపతి విజయ్ తాజా చిత్రం ‘బీస్ట్’ వేసవి కానుకగా ఏప్రిల్ నెలలో విడుదల కాబోతోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. రాజకీయ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ‘బీస్ట్’ మూవీపై బాలీవుడ్ నిర్మాతల కన్నుపడింది. అయితే ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాద్ వాలా ఈ సినిమా రీమేక్ హక్కుల్ని ఫ్యాన్స్ ఆఫర్ తో సొంతం చేసుకోవాలనుకుంటున్నాడట. పోటీపడుతున్న వారిలో ఇప్పుడు సాజిద్ దే పైచేయిగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే సాజిద్ ఆఫర్ పై ఇంకా సన్ పిక్చర్స్ సంస్థ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. ఇటీవల సాజిద్ నడియాద్ వాలా దక్షిణాది చిత్రాల రీమేక్స్ పై గట్టి దృష్టి పెట్టాడు. హిందీలో వీటిని యధాతథంగా కాకుండా మెయిన్ కంటెంట్ ను మాత్రం తీసుకుని, ఉత్తరాది వారికి నచ్చేలా సరికొత్త స్క్రీన్ ప్లే తో రీమేక్ చేస్తున్నాడు.
ఆ మధ్య ‘వర్షం’ రీమేక్ హక్కులు తీసుకుని ‘బాఘీ’ చిత్రాన్ని పూర్తిగా మార్చేసి తీశాడు సాజిద్ నడియాద్ వాలా. అలానే ‘కిక్’ సినిమానూ చాలా వరకూ మార్చి తీశాడు. తాజాగా తమిళ చిత్రం ‘జిగర్తాండ’ హక్కుల్ని తీసుకుని ‘బచ్చన్ పాండే’ పేరుతో రీమేక్ చేశాడు. ఇది ‘జిగర్తాండ’ రీమేక్ అని చెబితే కానీ తెలియనంతగా మార్పులు చేర్పులు చేశాడట. అలానే రేపు ‘బీస్ట్’ సినిమా కథను ఉత్తరాది వీక్షకుల ఆలోచనలకు అనుగుణంగా రీమేక్ చేయాలని సాజిద్ భావిస్తున్నాడట. ఒక్కసారి సన్ పిక్చర్స్ నుండి హక్కులు లభిస్తే, వెంటనే నటీనటులను ప్రకటించడంతో పాటు రీమేక్ షూటింగ్ నూ స్టార్ట్ చేయాలన్నది సాజిద్ నడియాద్ వాలా ఆలోచన అని తెలుస్తోంది.
Also Read
తాజావార్తలు
-
Indore: నీట్ పరీక్షకు మందు మరొక విద్యార్థిని బలి.. బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య
-
Jio IPO: వేల కోట్లు కొల్లగొట్టడానికి రెడీ అయిన జియో.. ఐపీఓపై అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసిన ముఖేష్ అంబానీ!
-
The Paradise: ఈరోజు సాయంత్రం ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు! నాని ‘ప్యారడైజ్’ న్యూ పోస్టర్ చూశారా?
-
JD Vance: మరోసారి భార్య ఉషా గురించి జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు.. వైరల్
-
Nagadurga: సుకుమార్ – బన్నీ వాస్ బ్యానర్లలో క్రేజీ ప్రాజెక్ట్.. ప్రియదర్శి జోడీగా రంగంలోకి దిగిన ఫోక్ స్టార్!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?