‘మనసా నమః’ దర్శకుడితో శర్వానంద్ మూవీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల విడుదలైన శర్వానంద్ ‘శ్రీకారం’ చిత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేదు. దాంతో ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాలపై శర్వానంద్ ఆశలన్నీ పెట్టుకున్నాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ద్విభాషా చిత్రంలో శర్వానంద్ రీతూవర్మతో కలిసి నటిస్తున్నాడు. అలానే అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మహా సముద్రం’లోనూ చేస్తున్నాడు. ఇది కూడా తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటోంది. ఈ రెండూ కాకుండా కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘ఆడాళ్ళు మీకు జోహార్లు’ మూవీ చేయడానికీ శర్వానంద్ కమిట్ అయ్యాడు.
వీటి కథ ఇలా ఉంటే… తాజాగా శర్వా ఓ షార్ట్ ఫిల్మ్ మేకర్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఫిల్మ్ నగర్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఫీల్ గుడ్ షార్ట్ ఫిల్మ్ ‘మనసా నమః’తో దర్శకుడు దీపక్ రెడ్డికి మంచి గుర్తింపు వచ్చింది. పలువురు యంగ్ హీరోస్ అతనితో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో యూవీ క్రియేషన్స్ కు దీపక్ రెడ్డి చెప్పిన కథ బాగా నచ్చిందని, దాన్ని శర్వానంద్ హీరోగా తెరకెక్కించడానికి సిద్ధమయ్యారని అంటున్నారు. శర్వానంద్ సైతం కథ విని తన అంగీకారాన్ని తెలిపాడట. ప్రస్తుతం ఉన్న సినిమాల షూటింగ్స్ పూర్తి కాగానే ఇది పట్టాలెక్కుతుందని తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ నుండి ఇప్పటికే కొరటాల శివ, సుజిత్, రాధాకృష్ణ వంటి దర్శకులుగా పరిచయం అయ్యారు. ఆ జాబితాలో త్వరలో దీపిక్ రెడ్డి పేరు సైతం చేరబోతోంది.
Also Read
తాజావార్తలు
-
Trivikram Srinivas: అప్పట్లో ‘అజ్ఞాతవాసి’ దెబ్బకు ఇల్లు అమ్మేయాలనుకున్న త్రివిక్రమ్.. అసలేం జరిగిందంటే?
-
Irumudi: అసలు ఇరుముడి అంటే ఏంటి?
-
Rahul Gandhi: హల్ద్వానీలో ‘శుద్ధీకరణ’ వివాదం.. ఎఫ్ఐఆర్కు రాహుల్ గాంధీ డిమాండ్
-
AI in Cinema: సినీ రంగంపై ఏఐ ఎఫెక్ట్.. సెట్లో 20% మనుషులు, 80% AI.. జూనియర్ ఆర్టిస్టుల పరిస్థితి ఏంటి?
-
Ashwin: “కోహ్లీ కంటే బుమ్రానే బెటర్”.. భారత క్రికెట్ గ్రేటెస్ట్పై అశ్విన్ సంచలన తీర్పు
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!