NTV Telugu Site icon

నేడు నల్గొండలో పర్యటించనున్న వైఎస్ షర్మిల…

నేడు నల్గొండ జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటించనుంది. పలు కుటుంబాలను పరామర్శించడంతో పాటు జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తెలుసుకోనున్నారు. మిర్యాలగూడ లోని బంగారు గడ్డలో సలీం కుటుంబానికి పరామర్శించనున్నారు. మేడారంలో ఉద్యోగ నోటిఫికేషన్ రాలేదని ఆత్మహత్యా యత్నం చేసిన నీలకంఠ సాయిని, అతని కుటుంబాన్ని పరామర్శిస్తారు. మధ్యాహ్నం హుజుర్ నగర్ లో వై ఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించనున్న వైఎస్ షర్మిల… కోదాడ సమీపంలోని దొండపాడులో మహానేత వైఎస్‌ఆర్‌ గారి అనుచరుడు, కుటుంబ సన్నిహితులు గున్నం నాగిరెడ్డి కుటుంబాన్ని వైఎస్‌ షర్మిల పరామర్శించనున్నారు.