YS Sharmila: మరదలు అని అవమానిస్తే ఊరుకోవాలా.. మరోలా వెళ్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Sharmila Reacts On TRS MLAs Complaint To Speaker Pocharam Srinivas: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ పోచారం శ్రీనివాస్కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే! రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తోన్న షర్మిల.. ఈ సందర్భంగా మంత్రులు – ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, వ్యక్తిగత విమర్శలు చేస్తూ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై తాజాగా వైఎస్ షర్మిల స్పందించారు. స్పీకర్ చర్యలు తీసుకుంటే, తాము న్యాయబద్ధంగా ముందుకెళ్తామని అన్నారు. పాదయాత్ర ఆపేస్తే తాము మరోలా ప్రజల్లోకి వెళ్తామని చెప్పారు.
ఇదే సమయంలో మంత్రి నిరంజన్ రెడ్డిపై తాను చేసిన వ్యాఖ్యల మీద స్పందిస్తూ.. ‘‘ఆయన మరదలు అని అవమానిస్తే ఊరుకోవాలా? మాకు ఆత్మ గౌరవం ఉండదా’’ అంటూ షర్మిల నిలదీశారు. తన ప్రసంగాల్లో ఎమ్మెల్యేల అవినీతిపై ప్రజలు చర్చించుకుంటున్న అంశాలనే ప్రస్తావించానన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతోందో, తాము ఏం చేస్తున్నామో ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. మంత్రులకు గానీ, ఎమ్మెల్యేలకు గానీ పాలమూరి, రంగారెడ్డి జిల్లాలపై ఉన్న ప్రేమెంత? అంటూ ప్రశ్నించారు. తమ పాదయాత్రలో భాగంగా ఎమ్మెల్యేల చేసిన వ్యాఖ్యల్లో అవాస్తవాలేమీ లేవన్నారు. తాను ప్రస్తావించిన విషయాల్లో ఏ ఒక్క అబద్ధమూ లేదని, అవన్నీ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులేనని పేర్కొన్నారు. ప్రజలే కాదు, విలేకరులు సైతం ఈ ఎమ్మెల్యేల గురించి మాట్లాడాలంటే భయపడుతున్నారని.. గళం విప్పిన వారిపై కేసులు పెట్టడమో, ఉద్యోగాల నుంచి తొలగించడమో చేస్తున్నారని ఆరోపణలు చేశారు.
Also Read
- Hyderabad Traffic : వాహనదారులకు బిగ్ అలర్ట్.. రేపు ఈ రూట్లలో నో ఎంట్రీ.!
- Medico Priyanka : కిమ్స్లో కూతురు మృత్యుపోరాటం.. తండ్రి కన్నీటి వేడుకోలు.!
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్కృష్ణారెడ్డి కేసులో సంచలన మలుపు
- KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
ఇన్నాళ్లు వాళ్ల అవినీతి కొనసాగిందని, తాము తెలంగాణకి వచ్చి వారి తప్పుల్ని ఎత్తిచూపుతున్నామని షర్మిల చెప్పారు. తెలంగాణలోని ఎమ్మెల్యేలు చేస్తోందని దోపడీ రాజ్యమని, దానిపై ఇక్కడి ప్రతిపక్షాలు మాట్లాడకపోవడం దారుణమని అన్నారు. ఎనిమిది సంవత్సరాలుగా తెలంగాణలో ఎంతో అవినీతి జరిగిందని.. ఇన్నేళ్లు కాంగ్రెస్ పార్టీ గానీ, బీజేపీ పార్టీ గానీ ఎందుకు ఆ అవినీతిని లేవనెత్తలేదని ప్రశ్నించారు. వాళ్లు చేయలేని విషయాల్ని తాను చేస్తే, అది దారుణమంటారా? అని నిలదీశారు. వాళ్లు దౌర్జన్యం చేస్తే పర్వాలేదా? నిజం మాట్లాడితే దారుణమా? అని అడిగారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకుల్ని కొన్నట్టు.. తనని కొనడం వాళ్లకు వీలు కాదని షర్మిల తేల్చి చెప్పారు.
తాజావార్తలు
-
Modi-Yogi Meeting: మోడీతో యోగీ భేటీ.. యూపీ ఎన్నికలపై చర్చ..!
-
EPFO New Rules: PFలో 8 కీలక మార్పులు ఇవే! క్లెయిమ్, విత్డ్రాయల్, నామినేషన్పై ప్రభావం
-
Trump: ట్రంప్నకు సెనేట్ షాక్.. అధ్యక్షుడి ప్రాతిపాదనకు ఎదురుదెబ్బ
-
Hyderabad Traffic : వాహనదారులకు బిగ్ అలర్ట్.. రేపు ఈ రూట్లలో నో ఎంట్రీ.!
-
NDA: డీలిమిటేషన్కు బాదల్ మద్దతు.. బీజేపీ-అకాలీదళ్ పొత్తుకు బీజం..
ట్రెండింగ్
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!