Y. S. Sharmila: మరోసారి ఫైర్.. పండిత పుత్ర పరమ శుంఠ అని మీనాన్నే చెప్పారు నేను చెప్తే తప్పా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Y. S. Sharmila: ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పై మరో సారి షర్మిల ఫైర్ అయ్యారు. మెదక్ జిల్లాలో.. తనపై నమోదైన ఎస్పీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై వైఎస్ షర్మిల స్పందించారు. నువ్వు అవినీతి చేస్తే తప్పులేదు నేను నీ అవినీతిని ఎత్తి చూపితే తప్పా? అంటూ ప్రశ్నించారు. పండిత పుత్ర పరమ శుంఠ.. అని మీ నాన్నే చెప్పారు కదా! మరి నేను చెబుతే తప్పా? అంటూ ప్రశ్నించారు షర్మిల. ఆందోల్ ఎమ్మెల్యే, ఆయన తమ్ముళ్లు అవినీతి కబ్జాలకు పాల్పడుతున్నారని సొంత తండ్రే చెప్పారు అని షర్మిల చెప్పారు. నేను అదే చెప్పాను దానికి నువ్వు నామీద కేసు వేసావు.. మరి మీ తండ్రి పై కూడా కేసు పెడతారా? అంటూ ప్రశ్నించారు. దళిత ఎమ్మెల్యే అవినీతి చేస్తే ప్రశ్నించవద్దని ఏ రాజ్యాంగంలో రాసి ఉంది? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు షర్మిల.
Read also: Uttarakhand: హిమపాతంలో చిక్కుకున్న 28 మంది.. పలువురి మృతి..?
Also Read
- N. Ramchander Rao: ఫీజు రీయింబర్స్మెంట్పై బీజేపీ పోరుబాట.. సీఎం రేవంత్పై బీజేపీ చీఫ్ ఫైర్
- TPCC: సీఎం రేవంత్రెడ్డితో మల్లు రవి భేటీ.. కొండా సురేఖ ఎపిసోడ్పై మీనాక్షి నటరాజన్, పీసీసీకి నివేదిక..
- Sangareddy: ప్రియుడి మోజులో కన్న తల్లిదండ్రులను చంపిన యువతి.. అదే మత్తు ఇంజెక్షన్తో తానూ ఆత్మహత్య
- Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
YSRTP అద్యక్షురాలు వైఎస్ షర్మిలపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత నాయకుడు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. సంగారెడ్డి జిల్లాలో ప్రజాప్రస్థాన పాదయాత్ర చేస్తున్న సమయంలో షర్మిల ఆంధోల్ నియోజకవర్గం జోగిపేటలో స్థానిక ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ను అవమానపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు షర్మిలపై దళిత, టీఆర్ఎస్ నాయకులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గౌరవపదమైన హోదాలో ఉన్న దళిత జాతి బిడ్డను పేరుపెట్టి కాకుండా అవమానకరంగా మాట్లాడినందుకు వైఎస్ షర్మిలపై SC, ST, చట్టం కింద కేసు నమోదచేయాలని దళిత నాయకులు పోలీసులకు కోరారు.
జోగిపేట బస్టాండ్ దగ్గర బహిరంగ సభలో వైఎస్ షర్మిల ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కాదు, “కంత్రి” కిరణ్ అంటూ ఘాటు విమర్శలు చేశారు. కాగా, ఎక్కడ చూసినా కబ్జాలే ఎక్కడ ప్రభుత్వ స్థలం కనిపిస్తే జెండా పాతడమే ఆయన వృత్తి అంటూ తీవ్రస్థాయిలో ఆరోపించారు… ఒక దళితుడు అయి ఉండి చెరువులు.. అసైన్డ్ భూములు అన్ని కబ్జాలే చేస్తున్నారని స్వయంగా ఆయన తండ్రే చెప్పారంటూ వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. అయితే.. పండిత పుత్ర పరమ శుంఠ, నా కొడుకులు అంతా శుంఠలు అని స్వయంగా క్రాంతి కిరణ్ తండ్రే చెప్పారంటూ షర్మిల నిరాధారమైన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా.. దళిత బిడ్డ అయి ఉండి ఏనాడైనా దళితుల హక్కుల కోసం పోరాడారా? అని ప్రశ్నించారు. కాగా, ఒక జర్నలిస్ట్ అయి ఉండి ఏనాడు జర్నలిస్టుల కోసం కొట్లాడలేదని విమర్శించారు షర్మిల. అయితే తాను చేసిన విమర్శలు.. ఆరోపణలపైనే టీఆర్ఎస్ నాయకులు, దళిత సంఘాల నాయకులు ఎస్సీ , ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
NRI Welcomes KCR Plans: లండన్ టవర్ బ్రిడ్జ్ వద్ద కేసీఆర్ కటౌట్.. మద్దతుగా యూకే ఎన్నారైలు
తాజావార్తలు
-
Lava Virat V1 Pro 5G: లావా విరాట్ V1 ప్రో 5G రిలీజ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ.. ధర, ఫీచర్లు ఇవే
-
Vijaysai Reddy: బీజేపీలో అస్సలు చేరను.. కొత్త పార్టీపై త్వరలోనే చెప్తా!
-
Jammu Kashmir: 23 మంది కశ్మీరీ పండిట్ల హత్యాకాండ.. 28 ఏళ్ల క్రితం నాటి ఊచకోత కేసు పునర్ విచారణ
-
Rashmika Mandanna: సర్జరీ తర్వాత తొలిసారి బయటకు.. భర్త విజయ్ దేవరకొండతో రష్మిక సందడి!
-
Rishabh Pant Record: రిషభ్ పంత్ అరుదైన ఘనత.. గురువు గారి రేర్ రికార్డు బ్రేక్!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!