Y. S. Sharmila: మరోసారి ఫైర్.. పండిత పుత్ర పరమ శుంఠ అని మీనాన్నే చెప్పారు నేను చెప్తే తప్పా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Y. S. Sharmila: ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పై మరో సారి షర్మిల ఫైర్ అయ్యారు. మెదక్ జిల్లాలో.. తనపై నమోదైన ఎస్పీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై వైఎస్ షర్మిల స్పందించారు. నువ్వు అవినీతి చేస్తే తప్పులేదు నేను నీ అవినీతిని ఎత్తి చూపితే తప్పా? అంటూ ప్రశ్నించారు. పండిత పుత్ర పరమ శుంఠ.. అని మీ నాన్నే చెప్పారు కదా! మరి నేను చెబుతే తప్పా? అంటూ ప్రశ్నించారు షర్మిల. ఆందోల్ ఎమ్మెల్యే, ఆయన తమ్ముళ్లు అవినీతి కబ్జాలకు పాల్పడుతున్నారని సొంత తండ్రే చెప్పారు అని షర్మిల చెప్పారు. నేను అదే చెప్పాను దానికి నువ్వు నామీద కేసు వేసావు.. మరి మీ తండ్రి పై కూడా కేసు పెడతారా? అంటూ ప్రశ్నించారు. దళిత ఎమ్మెల్యే అవినీతి చేస్తే ప్రశ్నించవద్దని ఏ రాజ్యాంగంలో రాసి ఉంది? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు షర్మిల.
Read also: Uttarakhand: హిమపాతంలో చిక్కుకున్న 28 మంది.. పలువురి మృతి..?
Also Read
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
- Off The Record : ముహూర్తం ఖరారు కాలేదా? కేబినెట్ విస్తరణపై మళ్ళీ బ్రేక్ పడిందా?
- K Kavitha : కవితకు సమన్లు.. రేపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశం..
YSRTP అద్యక్షురాలు వైఎస్ షర్మిలపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత నాయకుడు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. సంగారెడ్డి జిల్లాలో ప్రజాప్రస్థాన పాదయాత్ర చేస్తున్న సమయంలో షర్మిల ఆంధోల్ నియోజకవర్గం జోగిపేటలో స్థానిక ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ను అవమానపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు షర్మిలపై దళిత, టీఆర్ఎస్ నాయకులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గౌరవపదమైన హోదాలో ఉన్న దళిత జాతి బిడ్డను పేరుపెట్టి కాకుండా అవమానకరంగా మాట్లాడినందుకు వైఎస్ షర్మిలపై SC, ST, చట్టం కింద కేసు నమోదచేయాలని దళిత నాయకులు పోలీసులకు కోరారు.
జోగిపేట బస్టాండ్ దగ్గర బహిరంగ సభలో వైఎస్ షర్మిల ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కాదు, “కంత్రి” కిరణ్ అంటూ ఘాటు విమర్శలు చేశారు. కాగా, ఎక్కడ చూసినా కబ్జాలే ఎక్కడ ప్రభుత్వ స్థలం కనిపిస్తే జెండా పాతడమే ఆయన వృత్తి అంటూ తీవ్రస్థాయిలో ఆరోపించారు… ఒక దళితుడు అయి ఉండి చెరువులు.. అసైన్డ్ భూములు అన్ని కబ్జాలే చేస్తున్నారని స్వయంగా ఆయన తండ్రే చెప్పారంటూ వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. అయితే.. పండిత పుత్ర పరమ శుంఠ, నా కొడుకులు అంతా శుంఠలు అని స్వయంగా క్రాంతి కిరణ్ తండ్రే చెప్పారంటూ షర్మిల నిరాధారమైన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా.. దళిత బిడ్డ అయి ఉండి ఏనాడైనా దళితుల హక్కుల కోసం పోరాడారా? అని ప్రశ్నించారు. కాగా, ఒక జర్నలిస్ట్ అయి ఉండి ఏనాడు జర్నలిస్టుల కోసం కొట్లాడలేదని విమర్శించారు షర్మిల. అయితే తాను చేసిన విమర్శలు.. ఆరోపణలపైనే టీఆర్ఎస్ నాయకులు, దళిత సంఘాల నాయకులు ఎస్సీ , ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
NRI Welcomes KCR Plans: లండన్ టవర్ బ్రిడ్జ్ వద్ద కేసీఆర్ కటౌట్.. మద్దతుగా యూకే ఎన్నారైలు
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!