Y. S. Sharmila: మరోసారి ఫైర్.. పండిత పుత్ర పరమ శుంఠ అని మీనాన్నే చెప్పారు నేను చెప్తే తప్పా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Y. S. Sharmila: ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పై మరో సారి షర్మిల ఫైర్ అయ్యారు. మెదక్ జిల్లాలో.. తనపై నమోదైన ఎస్పీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై వైఎస్ షర్మిల స్పందించారు. నువ్వు అవినీతి చేస్తే తప్పులేదు నేను నీ అవినీతిని ఎత్తి చూపితే తప్పా? అంటూ ప్రశ్నించారు. పండిత పుత్ర పరమ శుంఠ.. అని మీ నాన్నే చెప్పారు కదా! మరి నేను చెబుతే తప్పా? అంటూ ప్రశ్నించారు షర్మిల. ఆందోల్ ఎమ్మెల్యే, ఆయన తమ్ముళ్లు అవినీతి కబ్జాలకు పాల్పడుతున్నారని సొంత తండ్రే చెప్పారు అని షర్మిల చెప్పారు. నేను అదే చెప్పాను దానికి నువ్వు నామీద కేసు వేసావు.. మరి మీ తండ్రి పై కూడా కేసు పెడతారా? అంటూ ప్రశ్నించారు. దళిత ఎమ్మెల్యే అవినీతి చేస్తే ప్రశ్నించవద్దని ఏ రాజ్యాంగంలో రాసి ఉంది? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు షర్మిల.
Read also: Uttarakhand: హిమపాతంలో చిక్కుకున్న 28 మంది.. పలువురి మృతి..?
Also Read
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
YSRTP అద్యక్షురాలు వైఎస్ షర్మిలపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత నాయకుడు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. సంగారెడ్డి జిల్లాలో ప్రజాప్రస్థాన పాదయాత్ర చేస్తున్న సమయంలో షర్మిల ఆంధోల్ నియోజకవర్గం జోగిపేటలో స్థానిక ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ను అవమానపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు షర్మిలపై దళిత, టీఆర్ఎస్ నాయకులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గౌరవపదమైన హోదాలో ఉన్న దళిత జాతి బిడ్డను పేరుపెట్టి కాకుండా అవమానకరంగా మాట్లాడినందుకు వైఎస్ షర్మిలపై SC, ST, చట్టం కింద కేసు నమోదచేయాలని దళిత నాయకులు పోలీసులకు కోరారు.
జోగిపేట బస్టాండ్ దగ్గర బహిరంగ సభలో వైఎస్ షర్మిల ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కాదు, “కంత్రి” కిరణ్ అంటూ ఘాటు విమర్శలు చేశారు. కాగా, ఎక్కడ చూసినా కబ్జాలే ఎక్కడ ప్రభుత్వ స్థలం కనిపిస్తే జెండా పాతడమే ఆయన వృత్తి అంటూ తీవ్రస్థాయిలో ఆరోపించారు… ఒక దళితుడు అయి ఉండి చెరువులు.. అసైన్డ్ భూములు అన్ని కబ్జాలే చేస్తున్నారని స్వయంగా ఆయన తండ్రే చెప్పారంటూ వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. అయితే.. పండిత పుత్ర పరమ శుంఠ, నా కొడుకులు అంతా శుంఠలు అని స్వయంగా క్రాంతి కిరణ్ తండ్రే చెప్పారంటూ షర్మిల నిరాధారమైన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా.. దళిత బిడ్డ అయి ఉండి ఏనాడైనా దళితుల హక్కుల కోసం పోరాడారా? అని ప్రశ్నించారు. కాగా, ఒక జర్నలిస్ట్ అయి ఉండి ఏనాడు జర్నలిస్టుల కోసం కొట్లాడలేదని విమర్శించారు షర్మిల. అయితే తాను చేసిన విమర్శలు.. ఆరోపణలపైనే టీఆర్ఎస్ నాయకులు, దళిత సంఘాల నాయకులు ఎస్సీ , ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
NRI Welcomes KCR Plans: లండన్ టవర్ బ్రిడ్జ్ వద్ద కేసీఆర్ కటౌట్.. మద్దతుగా యూకే ఎన్నారైలు
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!