YS Sharmila: రాజా సింగ్ ఒక కమెడియన్.. ఇదంతా కేసీఆరే నడిపిస్తున్నారు
YS Sharmila Fires On MLA Raja Singh Issue: ఎమ్మెల్యే రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారంపై తాజాగా వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. రాజా సింగ్ ఒక కమెడియన్ అని.. ఎమ్మెల్యే స్థాయి చేతకాకపోతే కమెడియన్గా ఉండండని హితవు పలికారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు చూస్తుంటే చాలా బాధ కలుగుతోందన్నారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టి.. ఆ చిచ్చులో చలి కాచుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఎన్నో మతాలకు, ఎన్నో సంప్రదాయాలకు నిలయమైన రాష్ట్రమని.. ఇలా ప్రశాంతంగా ఉంచడం బీజేపీకి ఇష్టం లేదని ఆరోపించారు. బీజేపీ ఒక మత పార్టీ, మత పిచ్చి ఉన్న పార్టీ అని రుజువైందని అన్నారు. మతం పేరు చెప్పి, రాజకీయం చేస్తారని నిరూపితమైందని చెప్పారు.
ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడకూడని మాటలు విన్నామని.. ఎమ్మెల్యే అంటే ఒక నియోజక వర్గ ప్రజలకు, అన్ని కులాలు, మతాల వారికి ఎమ్మెల్యే అని షర్మిల అన్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టేలా రాజా సింగ్ మాట్లాడటం సరి కాదన్నారు. అతనిపై బీజేపీ ఎలాంటి చర్యలు తీసుకుందో క్లారిటీ లేదన్న ఆమె.. సస్పెండ్ చేశాం, షో కాజ్ నోటీస్ ఇచ్చామని బీజేపీ అంటోందని, సస్పెండ్ చేస్తే క్లియర్గా చెప్పాలని బీజేపీని అడిగారు. షో కాజ్ నోటీస్ అంటే.. వివరణ ఇచ్చుకో అని చెప్తున్నారా?అంటూ నిలదీశారు. గతంలో బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడుగా ఉండి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్నారు. మసీదులు తవ్వుకుంటూ పోదాం.. శవాలు వస్తె మీవి.. శివ లింగాలు వస్తె మావి అన్నారని.. అయినా ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. రాజా సింగ్ కూడా గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని.. ఆయన ముస్లిం మతాన్ని టార్గెట్ చేస్తూనే ఉన్నారని చెప్పారు. బీజేపీకి ఓట్లు వేయకపోతే బుల్డోజర్తో నాశనం చేస్తానని రాజా సింగ్ అన్నారని.. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోనే ఇలా ఆయనిలా మాట్లాడుతున్నారని అన్నారు.
Also Read
ఒక మతాన్ని సైడ్ తీసుకొని బీజేపీ ఒకవైపే ఎలా మాట్లాడుతుందని షర్మిల ఫైరయ్యారు. ఓల్డ్ సిటీలో మళ్ళీ చిచ్చు పెడుతున్నారని, ఇదేనా బీజేపీకి చేతనైన రాజకీయమని ప్రశ్నించారు. రాజా సింగ అంశాన్ని గవర్నర్ చాలా సీరియస్గా తీసుకోవాలని, స్పీకర్ కూడా ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇటువంటి వాళ్ళను సమాజం సహిస్తే గొడవలు పెరుగుతూ ఉంటాయని హెచ్చరించారు. వైఎస్సార్ హయాంలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించారని, కేసీఅర్ మాత్రం ముస్లింలను ఘోరంగా మోసం చేశారని ఆరోపించారు. 12 శాతం రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి ఫెయిలయ్యారన్నారు. కవిత లిక్కర్ వ్యాపారాన్ని మళ్లించడానికి కేసీఆర్ ఈ రాజా సింగ్ అంశాన్ని వాడుకుంటున్నారని ఆరోపించారు. రాజా సింగ్ వెనుక కేసీఅర్ ఉన్నారని చర్చ జరుగుతోందని, డైవర్షన్ స్కీమ్ కింద రాజా సింగ్ ఎపిసోడ్ తీసుకొచ్చారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. మతాలు పేరు చెప్పి రాజకీయం చేయండి కానీ.. ప్రశాంతంగా ఉన్న తెలంగాణను మాత్రం రాజకీయాలకు వాడుకోకండని షర్మిల హితవు పలికారు.
తాజావార్తలు
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
-
Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో