Yadadri: మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవానికి సిద్ధమవుతున్న యాదాద్రి..
- మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవానికి యాదాద్రి సిద్ధం
- బుధవారం నుంచి 23వ తేదీ వరకు పంచకుండాత్మక నృసింహ మహా యాగం
- స్వామి వారికి అంకితం చేయనున్న దివ్య స్వర్ణ విమాన గోపురం
- శ్రీ మధుర కవి రామానుజ జీయర్ స్వామి పర్యవేక్షణలో మహా కుంభాభిషేక సంప్రోక్షణం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవానికి సిద్ధం అవుతుంది.. రేపటి నుండి (బుధవారం) 23వ తేదీ వరకు పంచకుండాత్మక నృసింహ మహా యాగం జరిపించి దివ్య స్వర్ణ విమాన గోపురాన్ని స్వామి వారికి అంకితం చేయనున్నారు. వానమామలై మఠం 31వ పీఠాధిపతులు శ్రీ మధుర కవి రామానుజ జీయర్ స్వామి పర్యవేక్షణలో మహాకుంభాభిషేక సంప్రోక్షణ క్రతువును నిర్వహించనున్నారు. ఈ వేడుకకు వచ్చే అతిధులు, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆధ్యాత్మికత వెళ్లి విరిసేలా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మహా కుంభాభిషేక సంరక్షణ మహోత్సవం సందర్భంగా పంచకుండాత్మక హోమం నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రధాన ఆలయ ఉత్తరం మాడ వీధిలో పర్ణశాల ఏర్పాటు చేశారు.
Read Also: Medak: ఇలా తయారవుతున్నారేంటీ.. భర్తకు వైద్యం చేయించలేక హత్య చేసిన భార్య
Also Read
- Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
- Bank Turns Bar : వారెవ్వా.. బ్యాంక్ను బార్గా మార్చిన ఉద్యోగులు.. లిక్కర్ డిపాజిట్.. నిబంధనలు విత్డ్రా..!
- Yadadri Bhuvanagiri: నా చావుకు వారే కారణం.. ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న వివాహిత..!
మరోవైపు.. వాసుదేవ, ప్రద్యుమ్న, సంకర్షణ, నారాయణ, అనిరుద్ధ, అనే దేవతామూర్తుల పేర్లతో ఐదు కుండాలు సిద్ధం చేశారు. పంచ కుండాల చెంత విశేష హోమాది పూజలు నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో 108 మంది రుత్వికులతో నృసింహ మూల, మూర్తి మంత్రం, రామాయణ, మహా భారత, ఇతిహాసాల పఠనం చేయనున్నారు. మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవం నేపథ్యంలో.. సోమవారం రోజున కోయిల్ తిరుమంజనం నిర్వహించారు. ప్రధాన ఆలయ ముఖ మండపం, ప్రధాన ప్రాకార మండపాలను సోమవారం దేవస్థానం సిబ్బంది శుద్ధి చేశారు. ప్రధాన ఆలయం ఉప ఆలయాలతో పాటు యాదగిరి కొండ చుట్టూ చలవ పందిరిలు, రాత్రి వేళలో ఆకర్షనీయంగా ఉండేలా విద్యుత్ కాంతులు విరజిమ్మె లైట్లు ఏర్పాటు చేశారు.
Read Also: Chhatrapati Shivaji: ఛత్రపతి శివాజీ సైన్యంలో మూడో వంతు ముస్లింలే.. నమ్మశక్యంకాని నిజాలు!
వీటితోపాటు యాదగిరిగుట్ట కొండ పైన జరిగే పూజా కార్యక్రమాల వివరాలు వేద పండితుల మంత్రోచ్ఛారణలు భక్తులు యాదగిరిగుట్ట పట్టణ ప్రజలకు వినిపించేలా మైక్ లు, కనిపించేలా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ స్వర్ణ దివ్య విమాన గోపురం మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో భాగంగా నిర్వహించే పంచకుండాత్మక యాగానికి పలువురు దాతలు సమిధలు అందజేశారు.
తాజావార్తలు
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
Dorothy : ఎన్నాళ్లకు.. కొత్త సినిమా ప్రకటించిన కోలివుడ్ స్టార్ డైరెక్టర్
-
YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
-
UPI Charges: రూ.2,000 దాటిన UPI చెల్లింపులపై ఛార్జీలు? ఎవరు చెల్లించాలి.. ఎలాంటి లావాదేవీలకు వర్తిస్తాయంటే?
-
Salman Khan: ఒక బాత్రూమ్కు 70 మంది.. జైల్లో గడిపిన రోజులు గుర్తు చేసుకున్న సల్మాన్ ఖాన్..
ట్రెండింగ్
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!