Yadadri: మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవానికి సిద్ధమవుతున్న యాదాద్రి..
- మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవానికి యాదాద్రి సిద్ధం
- బుధవారం నుంచి 23వ తేదీ వరకు పంచకుండాత్మక నృసింహ మహా యాగం
- స్వామి వారికి అంకితం చేయనున్న దివ్య స్వర్ణ విమాన గోపురం
- శ్రీ మధుర కవి రామానుజ జీయర్ స్వామి పర్యవేక్షణలో మహా కుంభాభిషేక సంప్రోక్షణం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవానికి సిద్ధం అవుతుంది.. రేపటి నుండి (బుధవారం) 23వ తేదీ వరకు పంచకుండాత్మక నృసింహ మహా యాగం జరిపించి దివ్య స్వర్ణ విమాన గోపురాన్ని స్వామి వారికి అంకితం చేయనున్నారు. వానమామలై మఠం 31వ పీఠాధిపతులు శ్రీ మధుర కవి రామానుజ జీయర్ స్వామి పర్యవేక్షణలో మహాకుంభాభిషేక సంప్రోక్షణ క్రతువును నిర్వహించనున్నారు. ఈ వేడుకకు వచ్చే అతిధులు, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆధ్యాత్మికత వెళ్లి విరిసేలా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మహా కుంభాభిషేక సంరక్షణ మహోత్సవం సందర్భంగా పంచకుండాత్మక హోమం నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రధాన ఆలయ ఉత్తరం మాడ వీధిలో పర్ణశాల ఏర్పాటు చేశారు.
Read Also: Medak: ఇలా తయారవుతున్నారేంటీ.. భర్తకు వైద్యం చేయించలేక హత్య చేసిన భార్య
Also Read
- Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
- Bank Turns Bar : వారెవ్వా.. బ్యాంక్ను బార్గా మార్చిన ఉద్యోగులు.. లిక్కర్ డిపాజిట్.. నిబంధనలు విత్డ్రా..!
- Yadadri Bhuvanagiri: నా చావుకు వారే కారణం.. ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న వివాహిత..!
మరోవైపు.. వాసుదేవ, ప్రద్యుమ్న, సంకర్షణ, నారాయణ, అనిరుద్ధ, అనే దేవతామూర్తుల పేర్లతో ఐదు కుండాలు సిద్ధం చేశారు. పంచ కుండాల చెంత విశేష హోమాది పూజలు నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో 108 మంది రుత్వికులతో నృసింహ మూల, మూర్తి మంత్రం, రామాయణ, మహా భారత, ఇతిహాసాల పఠనం చేయనున్నారు. మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవం నేపథ్యంలో.. సోమవారం రోజున కోయిల్ తిరుమంజనం నిర్వహించారు. ప్రధాన ఆలయ ముఖ మండపం, ప్రధాన ప్రాకార మండపాలను సోమవారం దేవస్థానం సిబ్బంది శుద్ధి చేశారు. ప్రధాన ఆలయం ఉప ఆలయాలతో పాటు యాదగిరి కొండ చుట్టూ చలవ పందిరిలు, రాత్రి వేళలో ఆకర్షనీయంగా ఉండేలా విద్యుత్ కాంతులు విరజిమ్మె లైట్లు ఏర్పాటు చేశారు.
Read Also: Chhatrapati Shivaji: ఛత్రపతి శివాజీ సైన్యంలో మూడో వంతు ముస్లింలే.. నమ్మశక్యంకాని నిజాలు!
వీటితోపాటు యాదగిరిగుట్ట కొండ పైన జరిగే పూజా కార్యక్రమాల వివరాలు వేద పండితుల మంత్రోచ్ఛారణలు భక్తులు యాదగిరిగుట్ట పట్టణ ప్రజలకు వినిపించేలా మైక్ లు, కనిపించేలా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ స్వర్ణ దివ్య విమాన గోపురం మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో భాగంగా నిర్వహించే పంచకుండాత్మక యాగానికి పలువురు దాతలు సమిధలు అందజేశారు.
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!