Fire Break: ఓజో ఫర్టిలైజర్ పరిశ్రమలో అగ్నిప్రమాదం..
- చౌటుప్పల్ మండలం ఎల్లం బావి ఓజో పరిశ్రమలో మంటలు..
- విత్తనాలకు సంబంధించిన ఉత్పత్తులు చేస్తున్న కంపనీ..
- మంటలు అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yadadri Fire Break: యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లం బావి గ్రామంలో ఉన్న ఓజో ఫర్టిలైజర్ పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భారీగా మంటలు, దట్టమైన పొగ వ్యాపించడంతో అప్రమత్తమైన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఆరు ఫైర్ ఇంజన్లు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. షార్ట్ సర్క్యూట్ ఈ అగ్ని ప్రమాదానికి కారణం కావచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రమాదంలో ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు. కానీ భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు యాజమాన్యం తెలుస్తోంది. అర్ధరాత్రి ప్రమాదం జరగడం, ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు, సిబ్బంది ఎవరూ పరిశ్రమలో లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది.
Read also: Warangal Crime: ప్రేమించిన అమ్మాయి కుటుంబంపై ప్రియుడు.. తల్లిదండ్రులు మృతి
Also Read
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
- Bank Turns Bar : వారెవ్వా.. బ్యాంక్ను బార్గా మార్చిన ఉద్యోగులు.. లిక్కర్ డిపాజిట్.. నిబంధనలు విత్డ్రా..!
- Yadadri Bhuvanagiri: నా చావుకు వారే కారణం.. ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న వివాహిత..!
- Bhuvanagiri: ఓటు వేయలేదని ఓటర్ల ఇళ్లపై బీరు సీసాలతో దాడి
హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద ఓ భవనంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే.. శ్రీదత్తసాయి కమర్షియల్ కాంప్లెక్స్లో మంటలు భారీగా చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మంటల ధాటికి కాంప్లెక్స్ అద్దాలు పగిలిపోయాయి. ఇదే కాంప్లెక్స్కు ఆనుకుని తపాడియా డయాగ్నస్టిక్ సెంటర్ కూడా ఉంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైరింజన్లతో ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దత్త సాయి కాంప్లెక్స్లో ఉన్న ఇద్దరిని సురక్షితంగా కిందికి దించారు చిక్కడపల్లి పోలీసులు. ముషీరాబాద్ నుంచి క్రాస్ రోడ్డుకు వచ్చే ట్రాఫిక్ను నిలిపివేశారు. దీంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. తపాడియా డయాగ్నస్టిక్ సెంటర్లో ఉన్న రోగులను అధికారులు బయటకు పంపారు. ఇదే కాంప్లెక్లో ఫర్నీచర్ షోరూం కూడా ఉంది. ఫర్నీచర్ షోరూంకు కూడా మంటలు అంటుకున్నాయి. దత్త సాయి కాంప్లెక్స్లోని 4వ అంతస్తులో ప్లాస్టిక్ గో డౌన్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలిసింది.
Lava Blaze X 5G : అదిరిపోయే ఫీచర్స్ తో వచ్చేస్తున్న బడ్జెట్ 5G లావా మొబైల్..
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!