Y.S. Sharmila: టీఆర్ఎస్ తాగుబోతులు, రేపిస్టుల పార్టీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖమ్మం జిల్లాలో పర్యటనలో ఉన్న వైఎస్సార్టీపీ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పార్టీపై, సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. ఖమ్మం నాయకులను టీఆర్ఎస్ పార్టీ డబ్బులతో కొనుక్కుందని..వ్యాపార లావాదేవీలు ఉన్నాయి కాబట్టే టీఆర్ఎస్ కు అమ్ముడు పోయారని విమర్శించారు. పశువుల లెక్క లైన్లో నిలబడి మేము రెడీ అన్నట్లు టీఆర్ఎస్ కు అమ్ముడు పోయారని అన్నారు. ప్రజల సమస్యలపై పోరాటం కోసమే వైఎస్సార్టీపీ పార్టీ పుట్టిందని షర్మిళ అన్నారు.
కేసీఆర్ దిక్కుమాలిన పాలనలో మంచి నీళ్లు కూడా దిక్కలేవని.. బడులు, గుడులు ఎన్ని ఉన్నాయో బార్లు, వైన్స్ కూడా అన్నే ఉన్నాయని ఆరోపించారు. ఆడవాళ్ల మాన, ప్రాణాలను పణంగా పెట్టి సీఎం కేసీఆర్ మద్యం వ్యాపారం చేస్తున్నారని దుయ్యబట్టారు. మద్యం రాబడితో రాష్ట్రాన్ని నడుపుతున్నాడని.. బాలికలకు కేసీఆర్ పాలనలో రక్షణ లేదని విమర్శించారు. బాలికలపై అత్యాచారాలు చేస్తుంది టీఆర్ఎస్ నేతల కొడుకులు, మనవళ్లు అంటూ ఆరోపణలు గుప్పించారు. టీఆర్ఎస్ పార్టీ హత్యాచారాలు, తాగుబోతులు, రేపిస్టుల పార్టీ అని విమర్శించారు.
Also Read
- Fake Doctors: హైదరాబాద్లో 11 మంది నకిలీ డాక్టర్ల అరెస్ట్..
- Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
- NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
- AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
రాష్ట్రంలో దారుణాలు జరుగుతుంటే సీఎం గాడిదలను కాస్తున్నారా.? అంటూ ప్రశ్నించారు. మంత్రి, ఎమ్మెల్యేల మీద ఎందుకు చర్యలు లేవని అడిగారు. ప్రభుత్వం మనదే ఇష్టం వచ్చినట్లు చేసుకోండని సీఎం ధైర్య ఇస్తున్నారని.. పనికోసం, సహాయం కోసం వెళ్తే ఆడవాళ్ల మాన ప్రాణాలను అడుగుతున్నారని విమర్శలు గుప్పించారు. మన దరిద్రం కోసం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడని.. ఆయన పాలనలో పేదలకు గౌరవం లేదని ఆరోపించారు. ఈ దరిద్రం సరిపోదు అన్నట్లుగా దేశాన్ని ఏలుతాడా అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ పాలనలో ఆయన కుటుంబమే బాగుపడిందని విమర్శించారు.
కేసీఆర్ బంగారు తెలంగాణ అని చెప్పి బతుకు లేని తెలంగాణగా మార్చాడని విమర్శించారు. రూ.800 కోట్లు టీఆర్ఎస్ అకౌంట్లో ఉంటే బంగారు తెలంగాణ ఎవరికి అయిందని ప్రశ్నించారు. దొంగోడికి తాళం ఇస్తే మొత్తం దోచుకుపోయినట్లుగా కేసీఆర్ తీరు ఉందని అన్నారు. 16 వేల కోట్లు మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని 4 లక్షల కోట్లు అప్పులు తెచ్చారని..కమీషన్ల రూపంలో తెచ్చిన అప్పులు కేసీఆర్ ఇంట్లోకి పోయాయని ఆరోపించారు. మాట ఇచ్చి మాట మీద నిలబడే వైఎస్సార్ బిడ్డ గా చెప్తున్న.. వైఎస్సార్ సంక్షేమ తెలంగాణ ను తీసుకు వస్తా అని హామీ ఇచ్చారు. కేసీఆర్ ను ఇక నమ్మింది, మోసపోయింది చాలని ఆమె ప్రజలకు సూచించారు.
తాజావార్తలు
-
Aashram Season 4: 3 సీజన్లు, 33 ఎపిసోడ్లతో 6 ఏళ్లుగా ఓటీటీని ఏలిన సిరీస్.. నాలుగో సీజన్లో బాబా నిరాలా రిటర్న్!
-
Fake Doctors: హైదరాబాద్లో 11 మంది నకిలీ డాక్టర్ల అరెస్ట్..
-
YS Jagan: వ్యవస్థలన్నీ కుప్పకూలాయి.. ప్రతి ఇంట్లో వైసీపీ, కూటమి పాలనపై చర్చ జరుగుతోంది..
-
Toxic Nizam GO : నైజాంలో టాక్సిక్ టికెట్స్ ధరలు పెంచుతూ జీవో రిలీజ్.. బుకింగ్స్ రిలీజ్
-
Yash: బస్సు డ్రైవర్ కొడుకు నుంచి పాన్ ఇండియా స్టార్ వరకు.. యష్ తీసుకున్న రిస్కులే ఈ స్టార్డమ్కు కారణం!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!