పెరుగుతున్న కూరగాయల ధరలు వంటింటి బడ్డెట్ ను తలకిందులు చేస్తుండటంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ధరలు పెరుతున్న వేగంగా తమ వేతనాలు పెరగక పోవడంతో అర్థ ఆకలితో కొంతమంది.. మరొ కొంతమంది ఒకపూజ భోజనం తోనే సరిపెట్టుకుంటూ.. కుటుంబాన్ని భారంగా నెట్టుకొస్తున్నారు.
పెరిగిన ధరల కారణంగా సామాన్య మానువుని మంచి పోషకాలను అందించే పప్పు ధాన్యాలు ఏవీ కూడా రూ.200లకు ఇంచుమించు ఏది తక్కువగా ఉండటం లేదు. కంది పప్పు ధర చూసుకుంటే రిటెల్ మార్కెట్ రూ.200 పలుకుతోంది. కంది పప్పుకు బదులుగా వాడుకునే బెంగుళూరు ఎర్రపప్పు రూ.140 తక్కువగా లేదు. మిననప్పు రూ.180, వేరు శనగలు రూ.175 ఈ విధంగా ఏది పప్పు ధర చూసుకున్నా సామాన్య మానవునికి అందుబాటులో లేదు.
సామాన్యుని జీవన విధానం పైన ప్రభావం చూపిస్తున్న పెరిగిన కూరగాయల ధరలతో ఏం తినేటట్లు లేదు. ఏం కొనేటట్టు లేదు అనే పరిస్థితి నెలకొంది. సామాన్య మధ్య తరగతికి భారం. టమాట, బీరకాయ, దోసకాయ, వంకాయ ఇలా చెప్పుకుంటూ.. వెళ్తే అన్ని కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. నిత్యావ సర వస్తువుల ధలతో పాటు కూరగాయల ధరలు ఆకాశాన్నంటడంతో వినియోగదారులు అందోళన చెందుతున్నారు.
పండించిన రైతులే అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మార్కెట్లో కూరగాయల ధరలతో పాటు నిత్యవసర వస్తువుల నూనెలు, విపరతీంగా పెరిగి కొనలేని పరిస్థితి నెలకొంది. టమాట కిలో రూ.40-50 కొంటున్న రిటైల్ వ్యాపారులు, వంకాయ కిలో రూ.50, బెండకాయ కిలో రూ.60, పచ్చిమిర్చి 80, కాకరకాయ కిలో రూ.60, ఫ్రెంచ్ బీన్స్కిలో రూ.100, క్యారెట్ కిలో రూ.50 పలుకుతుంది. దీంతో వినియోగదారుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. ఈ విధంగా వేటి ధరలు చూసిన భగ్గుమంటున్నారు. కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ఏం కొనాలో… ఏం తినాలో దిక్కుతోచని స్థితిలో సామాన్య మానవుడు సతమతం అవుతున్నాడు.
Nepal-India: ఇండియా భూభాగాలపై నేపాల్ పార్లమెంట్ లో చర్చ