NTV Telugu Site icon

ప్రియుడుతో కలిసి భర్తను హతమార్చిన భార్య…

అక్రమ సంబంధం పెట్టుకొని ప్రియుడు తో కలిసి భర్తను హతమార్చింది ఓ భార్య. బషీరాబాద్ లో ఈ నెల 17 వ తేదీన గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసును చెందించారు పోలీసులు. మృతుడు హనుమంతు హత్యకు కారణమైన భార్య అంబిక , రేవన్ సిద్ధప్ప లను అరెస్ట్ చేసారు. అరెస్ట్ ఐన ఇద్దరు కర్ణాటక రాష్ట్రం ఎలాక్ పల్లి గ్రామనికి చెందినవారు.

హత్య గావించబడిన హనుమంతు ఎనిమిది సంవత్సరాల క్రితం పక్షపాతంతో ఒక చెయ్యి, ఒక కాలు పనిచేయకపోవడంతో తాగుడుకు బానిసై వారి అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఈ నెల 16వ తేదీ హనుమంతు కు నిందితుడు ఫోన్ చేసి పిలిపించడం జరిగింది. బషీరాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్లే మార్గంలో హనుమంతు కు మద్యం తాగించి నవంద్గి గ్రామ శివారులో ఇతనిని రాయితో తల వెనుక భాగంలో కొట్టి భార్య గొంతు నలపగ అప్పటికే కొనఊపిరితో ఉన్న అతన్ని చూసి కల్వరతో గొంతు పైభాగం కోసి హత్య చేయడం జరిగింది. హనుమంతు చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత మృతదేహాన్ని మూటకట్టి భుజం పైన ఎత్తుకుని కొంత దూరం నడిచి బరువు మోయలేక అక్కడే మృతదేహాన్ని పడేసి మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించి వెళ్ళిపోయారు.