Harish Rao : రాష్ట్రం ముందు వరుసలో ఉండేందుకు కలిసికట్టుగా పని చేస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రూ.102 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ది పనులు ప్రారంభం చేసుకున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 56 రకాల ఆరోగ్య పరీక్షలు రేడియాలజీ, పతలాజి ల్యాబ్ లకు శంకుస్థాపన చేశారు మంత్రి హరీశ్ రావ్. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు రోగ నిర్దారణ కోసం ఈ ల్యాబ్ లు ఉపయోగ పడుతాయని అన్నారు. 200 పడకల ఆస్పత్రి ఆవరణలోనే మెడికల్ కాలేజీ వస్తుందని హరీశ్ రావ్ అన్నారు. వారం రోజుల్లో డయాలసిస్ సెంటర్ ,సిటి స్కాన్ మిషన్ మంజూరు చేస్తామని అన్నారు. ANM లు పని చేసే చోట 40 ఆరోగ్య కేంద్రాల నిర్మాణం కోసం రూ. 8 కోట్లు మంజూరు చేస్తామని తెలిపారు.
Phc ఉన్న చోటికి మెడికల్ కాలేజ్ స్థాయికి భూపాలపల్లి ఎదుగుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో ఆరోగ్య పరంగా మరింత అభివృద్ధి చేసుకుందామని భూపాల పల్లి ప్రజలకు ఆయన ఉత్సాహాన్ని నింపారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో అత్యధికంగా పెద్ద ఆపరేషన్ చేస్తున్నారని, ఇది మంచి పరిణామం కాదని, అనేక అనర్థాలు జరుగుతున్నాయని అన్నారు. సిజరియనల్లు అవసరం మేరకే చేయాలి తప్ప అనవసరంగా చేయవద్దని వైద్యులకు సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం మంచిదని ఆశలు, ఏఎన్ఎం లు ప్రచారం చేయాలని కోరారు.
Also Read
- TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
- Telangana Monsoon : తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాల జోరు షురూ..!
సీఎం కెసిఆర్ మీకు మరో వరం ఇచ్చారని, కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం అమలు ప్రారంభించనున్నట్లు హరీశ్ రావ్ ప్రకటించారు. 8 జిల్లాల్లో న్యూట్రిషన్ కిట్ పంపిణీ పథకం అమలు చేయబోతున్నామని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం పెంచిన ఘనత సీఎం కెసిఆర్ దే అని అన్నారు. అన్ని రకాల మందులు రోగులకు అందుబాటులో ఉంచడం కెసిఆర్ లక్ష్యమని అన్నారు. రాష్ట్రం ముందు వరుసలో ఉండేందుకు కలిసికట్టుగా పని చేస్తామని అన్నారు. తెలంగాణ లో కెసిఆర్ అధ్వర్యంలో ఇంత అభివృద్ధి చేస్తుంటే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అవాకులు చెవాకులు పేలుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నడ్డాకు దమాక్ ఉందా ?
నడ్డ ఎవరో రాసి ఇచ్చిన స్క్రిప్ట్ చదివాడని ఎద్దేవ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తో ఒక్క ఎకరం పారలేదు హరీశ్ రావ్ అన్నారు. గడ్కరీ కాళేశ్వరం ప్రాజెక్ట్ తో తెలంగాణ సస్యశ్యామలం అయ్యింది అంటే.. మీకే క్లారిటీ లేదు మీరు ఏం మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసు కాంగ్రెస్ దే అని విమర్శించారు. ముఖ్యమంత్రి పదవికి రేటు కట్టిన పార్టీ బీజేపీ అని ఎద్దేవ చేశారు. బీజేపీ నేతలు జూట మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయితి నీ జిల్లా చేసిన ఘనత సీఎం కెసిఆర్ దే నని అన్నారు. 75 ఎండ్ల లో మూడు మెడికల్ కాలేజీ లు ఉంటే..కెసిఆర్ పాలనలో 33 మెడికల్ కాలేజీ లు తీసుకు వచ్చారని హర్షం వ్యక్తం చేశారు హరీశ్ రావ్.
Nara Lokesh: జగన్ గారూ.. నిన్నటి సూసైడ్.. నేడు రేప్గా ఎలా మారింది?
- Tags
- ANM
- Asha
- bhuvanagari
- bjp
- congress
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!