Students Talent: స్టూడెంట్సా మజాకా.. టీచర్నే ఇరికించాలని చూసారుగా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Students Talent: ములుగు జిల్లా మల్లంపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కొందరు విద్యార్థులు సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు. తొమ్మిదో తరగతి చదువుతున్న ఏడుగురు విద్యార్థులు, ఇంటర్మీడియట్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు కలిసి పాఠశాలలో పనిచేశారు. విషయం తెలుసుకున్న పీఈటీ ఇదేంటని మందలించగా. తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయులతో వాగ్వాదానికి దిగారు. ఇదంతా కలకలం రేపడంతో అధికారులు విచారణ చేపట్టారు. విచారణలో అసలు విషయం బయటపడింది. విద్యార్థులదే తప్పు అని తేలింది. ఇంతలో ఆ 9 మంది విద్యార్థులు ఏమీ మాట్లాడకుండా ఇంటి నుంచి వెళ్లిపోయారు. తల్లిదండ్రులకు మరో కొత్త తలనొప్పి వచ్చిపడింది.
Read also: YV Subbareddy: పంచకర్ల రమేష్ బాబు రాజీనామా తొందర పాటు చర్య
Also Read
- Suicide on Video Call : వీడియో కాల్లోనే విషాదం.. భార్య చూస్తుండగానే భర్త ఆత్మహత్య
- ACB Raids : సస్పెండ్ అయినా తగ్గని లగ్జరీ.. సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో తనిఖీల్లో బయటపడ్డ కోట్లు..!
- GWMC : ఓరుగల్లు బల్దియాకు బాస్ ఎక్కడ.?
- Warangal: సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఏసీబీ రైడ్.. ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ల అక్రమ సంపదలు బట్టబయలు..!
తొమ్మిదో తరగతి చదువుతున్న ఏడుగురు విద్యార్థులు, ఇద్దరు ఇంటర్ విద్యార్థులు గత శనివారం (జూలై 8) రాత్రి పాఠశాలలో కలిసి మద్యం కొని తాగారు. విద్యార్థులు మందు తాగడం గమనించిన పీఈటీ టీచర్ వారిని మందలించారు. మరోసారి ఇలా చేయకూడదని హెచ్చరించాడు. దీనిపై తల్లిదండ్రులకు లేఖ రాశారు. విద్యార్థులు ఏమీ మాట్లాడకుండా ఇంటికి వెళ్లిపోయారు. పీఈటీ టీచర్ మద్యం తాగి లేఖ రాశారని తల్లిదండ్రులకు తెలిపారు. తల్లిదండ్రులు పిల్లల మాటలు నమ్మి మరుసటి రోజు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయులతో వాగ్వాదానికి దిగారు. దీనిపై సాంఘిక సంక్షేమ శాఖ ప్రాంతీయ సమన్వయకర్త విద్యారాణి మంగళవారం తహసీల్దార్ సత్యనారాయణ స్వామికి ఫిర్యాదు చేశారు. పాఠశాలకు వెళ్లి విచారించగా అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఏడుగురు, ఇంటర్మీడియట్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు మద్యం సేవించినట్లు విచారణలో తేలింది.
శనివారం రాత్రి మద్యం దుకాణంలో విద్యార్థులు మద్యం కొనుగోలు చేసినట్లు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా తేలింది. అయితే ఇంటికి వెళ్లిన విద్యార్థులు తిరిగి పాఠశాలకు రాకపోవడంతో వారిపై చర్యలు తీసుకోలేదని ప్రిన్సిపాల్ అంకయ్య తెలిపారు. 21 ఏళ్ల లోపు విద్యార్థులకు మద్యం విక్రయిస్తున్న మల్లంపల్లి శ్రీరామ వైన్స్పై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. తల్లిదండ్రులకు, విద్యాబుద్దులు చెప్పే మాస్టారుకే బురిడీ కొట్టించారంటే యూత్ రా నయనా అంటున్నారు స్థానికులు. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తున్నయో వీరికి అంటూ మండిపడుతున్నారు. ఉపాధ్యాయుడు తప్పుచేయలేదని తేలిందని, లేకపోతే అతని జీవితం నాశనం అయ్యేదని అంటున్నారు. తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యం విద్యార్థులపై కన్నువేసి ఉంచాలని తెలిపారు. అంతేకాకుండా పిల్లలు చెప్పేటప్పుడు తల్లిదండ్రులు వారి మాటలు గమనించాలని యాజమాన్యం తెలిపారు.
YV Subbareddy: పంచకర్ల రమేష్ బాబు రాజీనామా తొందర పాటు చర్య
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!