Site icon NTV Telugu

తెలంగాణ వచ్చినా.. నిరుద్యోగులు, రైతుల ఆత్మహత్యలు ఆగలేదు: వీహెచ్‌

తెలంగాణ రాష్ట్రం వచ్చినా నిరుద్యోగులు,రైతుల ఆత్మహత్యలు ఆగలేదని వీహెచ్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థుల పాత్ర మరువలేనిదన్నారు. అన్నంపెట్టే రైతు ఆత్మహత్య చేసుకుంటుంటే బాధగా ఉందన్నారు. కొట్లాడి న్యాయం జరిగేవరకు సాధించుకుందాం..ఆత్మహత్యలు ఆపండి అంటూ వీహెచ్‌ కోరారు.

Read Also: శాశ్వతంగా 124 జీవో,317జీవోను రద్దు చేయాలి: జీవన్‌రెడ్డి

దేశానికి అన్నం పెట్టే రైతన్న ఆపదలో ఉన్నాడు: కోదండ రెడ్డి..ఏఐసీసీ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు
దేశానికి అన్నం పెట్టే రైతన్న ఆపదలో ఉన్నాడు. రైతుల పట్ల కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రేమ లేదన్నారు. రైతులు వందల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకున్నా సీఎం కేసీఆర్‌ ఏ ఒక్క కుటుంబాన్ని పరామర్శించిన పాపాన పోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు ఆనందంగా వుండేవారన్నారు. విలువైన ప్రాణాలు పోగొట్టుకోవద్దు..రైతులు ధైర్యంగా ఉండాలన్నారు. మా మౌన దీక్షతో అయినా ప్రభుత్వంలో చలనం రావాలని కోరుకుంటున్నా అని కోదండ రెడ్డి అన్నారు.

Exit mobile version